ETV Bharat / sports

కోహ్లీ నెట్​ ప్రాక్టీస్​​.. కోచ్​తో రోహిత్​ చర్చ

author img

By

Published : Mar 1, 2021, 6:54 PM IST

Kohli & Co. sweat it out at nets ahead of fourth Test against England
కోహ్లీ నెట్​ ప్రాక్టీస్​​.. కోచ్​తో రోహిత్​ చర్చ

ఇంగ్లాండ్​తో జరగనున్న ఆఖరి టెస్టు కోసం టీమ్ఇండియా ఆటగాళ్లు నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్​ కోహ్లీ, వైస్​ కెప్టెన్​ రహానె నెట్స్​లో బ్యాటింగ్​ ప్రాక్టీస్​ చేస్తుండగా.. ఓపెనర్​ రోహిత్​ శర్మ కోచ్​ రవిశాస్త్రితో చర్చిస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్​లో పోస్ట్ చేసింది.

అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరగనున్న నాలుగో (తుది) టెస్టు కోసం భారత ఆటగాళ్లు నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్​లో బీసీసీఐ పోస్ట్​ చేసింది. కెప్టెన్​ కోహ్లీ, వైస్​కెప్టెన్​ అజింక్య రహానె నెట్స్​లో బ్యాటింగ్ చేస్తుండగా.. కోచ్​ రవిశాస్త్రితో రోహిత్​ శర్మ బ్యాటింగ్​ ప్రణాళికల గురించి చర్చిస్తున్నాడు.

ప్రాక్టీస్​లో భాగంగా వార్మప్​ చేస్తున్న ఫొటోను వైస్​ కెప్టెన్​ అజింక్య రహానె ట్విట్టర్​లో పంచుకున్నాడు. "చివరి మ్యాచ్​ ఆడడానికి సమయం దగ్గర పడనున్న క్రమంలో పరిమితులకు మించి శ్రమించాల్సి ఉంది" అని ఆ ఫొటోకు క్యాప్షన్​ ఇచ్చాడు.

ఈ సిరీస్​లో రోహిత్ శర్మ, అక్షర్​ పటేల్​, రవిచంద్రన్​ అశ్విన్​లు అంచనాలను అందుకోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి టెస్టులోనైనా సెంచరీ చేయాలని పట్టుదలతో ఉన్నాడు. విరాట్ చివరిసారిగా 2019లో శతకం చేశాడు.

నాలుగు టెస్టుల సిరీస్​లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన.. చివరి మ్యాచ్​ను గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని భావిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్​ రేసు నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్​ ఈ మ్యాచ్​లో గెలిచి సిరీస్​ను సమం చేయాలని యత్నిస్తోంది.

ఇదీ చూడండి: చివరి టెస్టు కోసం నెట్స్​లో శ్రమిస్తున్న భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.