ETV Bharat / sports

భారత్​తో ఆఖరి టెస్టుకు సామ్​కరన్​ దూరం

author img

By

Published : Feb 19, 2021, 8:23 AM IST

Sam Curran not available for 4th Test, confirms ECB
భారత్​తో ఆఖరి టెస్టుకు సామ్​కరన్​ దూరం

భారత జట్టుతో ఆడాల్సిన నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ సామ్​ కరన్​ అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్​, వేల్స్​ క్రికెట్​ బోర్డు స్పష్టం చేసింది. కానీ, టీమ్​ఇండియాతో జరగనున్న టీ20 సిరీస్​ సామ్​ కరన్​ ఆడతాడని ప్రకటించింది.

టీమ్ఇండియాతో జరగనున్న నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ సామ్​ కరన్​ అందుబాటులో ఉండడని ఇంగ్లీష్​ క్రికెట్​ బోర్డు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 26న ప్రత్యేక విమానంలో భారత్​కు పయనమవుతున్న సామ్​ కరన్.. చివరి టెస్టుకు కాకుండా టీ20 సిరీస్​లో ఆడతాడని ఆ దేశ బోర్డు వెల్లడించింది. ​

"సామ్​ కరన్ ఫిబ్రవరి 26న ఇంగ్లాండ్​ నుంచి ప్రత్యేక విమానంలో భారత్​కు చేరుకుంటాడు. టీమ్ఇండియాతో మార్చి 4న జరగనున్న ఆఖరి టెస్టులో అతడు ఆడాల్సి ఉంది. ప్రయాణ అడ్డంకుల వల్ల అతడు నాలుగో టెస్టులో అందుబాటులో ఉండడం లేదు. కానీ, టీ20 సిరీస్​లో ఆడతాడు".

- ఇంగ్లాండ్​, వేల్స్​ క్రికెట్​ బోర్డు

టీమ్ఇండియాతో మిగిలిన రెండు టెస్టుల్లో ఆడాల్సిన ఆటగాళ్ల జాబితాను ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు ఇటీవలే ప్రకటించింది. ఆ జట్టు కూర్పు వివరాలు..

ఇంగ్లాండ్​ జట్టు: జో రూట్​ (కెప్టెన్​), జేమ్స్​ అండర్సన్​, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్​స్టో, డొమినిక్​ బెస్​, స్టువర్ట్​ బ్రాడ్​, రోరే బర్న్స్​, జాక్​ క్రావ్లే, బెన్​ ఫోక్స్​, డాన్​ లారెన్స్​, జాక్​ లీచ్​, ఓల్లీ పోప్​, డోమ్​ సిబ్లీ, బెన్​ స్టోక్స్​, ఒల్లీ స్టోన్​, క్రిస్​ ఓక్స్​, మార్క్​ వుడ్​.

నాలుగు టెస్టుల సిరీస్​లో భారత్​, ఇంగ్లాండ్​ జట్లు చెరో మ్యాచ్​లో నెగ్గి.. సిరీస్​ను సమం చేశాయి.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​ X టీమ్​ఇండియా: మూడో వన్డే వేదిక మార్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.