ETV Bharat / sports

భారత్-న్యూజిలాండ్ మ్యాచ్​కు వర్షం అడ్డంకి

author img

By

Published : Feb 21, 2020, 9:07 AM IST

Updated : Mar 2, 2020, 1:03 AM IST

రహానే
రహానే

న్యూజిలాండ్​తో జరుగుతోన్న మొదటి టెస్టులో భారత బ్యాట్స్​మెన్ తడబడుతున్నారు. ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది టీమిండియా.

న్యూజిలాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత బ్యాట్స్​మెన్ తడబాటు కొనసాగుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ పృథ్వీషా(16), నయా వాల్‌ పుజారా(11), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(2), మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి(7) పూర్తిగా విఫలయమ్యారు. మయాంక్ అగర్వాల్ 34 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్​లో వెనుదిరిగాడు.

ప్రస్తుతం వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. టీమిండియా 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజులో రిషభ్ పంత్ (10), అజింక్య రహానే (38) ఉన్నారు. వీరిద్దరూ న్యూజిలాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తున్నారు.

Last Updated :Mar 2, 2020, 1:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.