ETV Bharat / sports

టీవీల్లోనూ ఐపీఎల్​ వ్యూయర్​షిప్​ అదరహో​

author img

By

Published : Nov 20, 2020, 4:47 PM IST

ipl 2020
ఐపీఎల్​ వ్యూహర్​షిప్​ అదుర్స్​..

ఈసారి ఐపీఎల్ అంచనాలకు మించి అలరించింది. గతేడాదితో పోలిస్తే 23 శాతం అధికంగా టెలివిజన్​ వ్యూయర్​షిప్​ సొంతం చేసుకుందని ప్రసారదారు సంస్థ స్టార్​ ఇండియా పేర్కొంది.

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్​ను యూఏఈలో నిర్వహించారు. అయినా సరే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. గతేడాదితో పోలిస్తే 23 శాతం ఎక్కువగా టీవీల్లో వీక్షించారు. ఈ విషయాన్ని ప్రసారసంస్థ స్టార్​ ఇండియా అధికారికంగా ప్రకటించింది. 31.57 మిలియన్ల వీక్షణలు నమోదైనట్లు వెల్లడించింది. హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వ్యూయర్​షిప్​ బాగా పెరిగిందని స్పష్టం చేసింది.

ఈసారి డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబయి మళ్లీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. వరుసగా రెండోసారి, మొత్తంగా ఐదోసారి ట్రోఫీ అందుకుని తిరుగులేని రికార్డులు సృష్టించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.