ETV Bharat / sports

ఇషాంత్ లేకుండా గంభీర్ జట్టు.. బుమ్రాకు రెస్ట్!

author img

By

Published : Feb 2, 2021, 8:50 AM IST

Gautam Gambhir picks his ideal Indian playing XI for the first Test against England
తొలిటెస్టుకు గంభీర్​ ఎంపిక చేసిన టీమ్​ఇండియా

ఇంగ్లాండ్​తో జరగనున్న తొలిటెస్టు కోసం తన దృష్టిలో ఉత్తమమైన టీమ్​ఇండియా జట్టును ఎంపిక చేశాడు భారత మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్. ఐదుగురు బౌలర్లకు టీమ్​లో ఛాన్స్ ఇస్తానని తెలిపాడు. ఇషాంత్​ను తుదిజట్టులోకి తీసుకోలేదు.

ఇంగ్లాండ్​తో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్​లోని తొలి మ్యాచ్​ కోసం టీమ్​ఇండియా జట్టును ఎంపిక చేయడం భారత సెలెక్టర్లకు ఈసారి కష్టతరం కావొచ్చు. ఆస్ట్రేలియా పర్యటనలో కుర్రాళ్లు అద్భుతంగా ఆడినా.. సీనియర్లకూ జట్టులో అవకాశం ఇవ్వాల్సిన నేపథ్యంలో ఎవర్ని ఎంచుకోవాలనే దానిపై టీమ్​ఇండియా మేనేజ్​మెంట్​ తలమునకలైంది. అయితే తొలిటెస్టుకు కావాల్సిన జట్టు కూర్పును మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్ తయారు చేశాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో భారత జట్టులో ఎంతమంది బౌలర్లను ఎంచుకుంటారనే దానిపై గంభీర్​ మాట్లాడాడు.

"కచ్చితంగా ఐదుగురు బౌలర్లతో ఆడాలని నేను గట్టిగా నమ్ముతున్నా. కాబట్టి, 7వ స్థానంలో అక్షర్​ పటేల్​ను ఎంపిక చేస్తా. అక్షర్​ బ్యాట్​తోనూ రాణించగలడు. సిడ్నీ టెస్టు తర్వాత అశ్విన్​లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. 8వ స్థానానికి అశ్విన్​ను తీసుకుంటా. దీంతో జట్టుకు 350 స్కోరు దాటే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్​ను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన బౌలర్లు అవసరం. తొలి టెస్టు కోసం జస్​ప్రీత్​ బుమ్రాను తీసుకుని.. రెండో మ్యాచ్​లో విరామాన్ని ఇచ్చి, పింక్​-బాల్​ టెస్టుకు సన్నద్ధమవడానికి సూచనలిస్తాను".

- గౌతమ్​ గంభీర్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

ఇంగ్లాండ్​తో తొలిటెస్టు కోసం గంభీర్​ ఎంపిక చేసిన జట్టు:

శుభ్​మన్​ గిల్​, రోహిత్​ శర్మ, ఛెతేశ్వర్​ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానె, రిషబ్​ పంత్​, అక్షర్​ పటేల్​, రవిచంద్రన్​ అశ్విన్​, కుల్దీప్​ యాదవ్​, జస్​ప్రీత్​ బుమ్రా, మహ్మద్​ సిరాజ్​.

ఇదీ చూడండి: భారత్‌, ఇంగ్లాండ్‌ కెప్టెన్ల ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.