యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ను నిర్వహించడం బీసీసీఐ అనుకున్న దాని కంటే కూడా సవాలుగా మారుతోంది. ఇద్దరు క్రికెటర్లు సహా చెన్నై సూపర్కింగ్స్కు చెందిన 13 మంది కొవిడ్-19 బారిన పడడం నిర్వాహకులకు ఆందోళన కలిగిస్తోంది. ఆ జట్టు షెడ్యూలు ప్రకారం టోర్నీని ఆరంభించగలదా అన్న అనుమానాల మధ్య బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించాడు.
"చెన్నై సూపర్కింగ్స్ పరిస్థితిపై నేనిప్పుడు మాట్లాడలేను. షెడ్యూలు ప్రకారం ఆ జట్టు టోర్నీలో తమ పోరును మొదలు పెట్టగలదో లేదో చూడాలి. ఐపీఎల్ చాలా సుదీర్ఘమైంది. అంతా సాఫీగా సాగుతుందని ఆశిస్తున్నా" అని గంగూలీ అన్నాడు.
వ్యక్తిగత కారణాలతో స్వదేశం రావాలని నిర్ణయించుకున్న కీలక బ్యాట్స్మన్ సురేశ్ రైనా.. మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. ఆఫ్స్పిన్నర్ హర్భజన్ సింగ్ టోర్నీలో ఆడాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. చెన్నైలో ఐదు రోజుల సన్నాహక శిబిరంలో కూడా అతడు పాల్గొనలేదు. భజ్జీ ఇంకా భారత్లోనే ఉన్నాడు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం అతడు యూఏఈలో జట్టుతో చేరాల్సి ఉంది.