ETV Bharat / sports

Ambati Rayudu News: మరో మూడేళ్లు క్రికెట్ ఆడతా: రాయుడు

author img

By

Published : Dec 28, 2021, 12:51 PM IST

rayudu
రాయుడు

Ambati Rayudu News: టీమ్​ఇండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు తన క్రికెట్​ కెరీర్​పై కీలక వ్యాఖ్యలు చేశాడు. మరో మూడేళ్లపాటు ఆటను కొనసాగిస్తానని చెప్పుకొచ్చాడు.

Ambati Rayudu News: టీమ్ఇండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు వచ్చే ఏడాది ఐపీఎల్​ సీజన్​లో ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో మరో మూడేళ్ల పాటు క్రికెట్​ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇటీవలే విజయ్​ హజారే ట్రోఫీలో అంధ్ర జట్టు తరఫున ఆడిన రాయుడు.. ఈ వ్యాఖ్యలు చేశాడు.

"ఫామ్​, ఫిట్​నెస్​ ఉన్నంతవరకూ క్రికెట్​ ఆడటం కొనసాగించాలనేది నా ఆశ. మరో మూడేళ్లు పాటు క్రికెట్ ఆడతా. ఫిట్​నెస్​పై ఫోకస్​ చేస్తున్నా. ఇటీవలే జరిగిన విజయ్​ హజారే ట్రోఫీలోను బాగానే రాణించాను."

-అంబటి రాయుడు, బ్యాటర్.

Ambati Rayudu Retirement: 2019 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీమ్​ఇండియా జట్టులో అంబటి రాయుడుకు చోటు లభించలేదు. ఈ కారణంగా అసంతృప్తి చెందిన రాయుడు.. జులైలో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. కానీ, రెండు నెలల తర్వాత తన రిటైర్మెంట్​ను వెనక్కి తీసుకున్నాడు.

ఈ విషయంపై స్పందించిన రాయుడు.. ప్రపంచకప్​ జట్టులో స్థానం లేకపోవడం బాధేసిందని చెప్పుకొచ్చాడు. అనంతరం ఐపీఎల్​లో సీఎస్కే తరఫున ఆడటం వల్ల బాధపోయిందని అన్నాడు. తనలో ఉత్తమ ఆటగాడిని బయటకుతీసుకొచ్చింది మాజీ సారథి ధోనీ అని ప్రశంసించాడు. వచ్చే ఏడాది ఐపీఎల్​ సీజన్​లోనూ సీఎస్కే తరఫున ఆడేందుకు ఆసక్తితో ఉన్నట్లు చెప్పాడు.

ఇదీ చదవండి:

2021 Cricket Highlights: భారీ సిక్సర్లు.. స్టన్నింగ్ క్యాచ్​లు!

IND vs SA Test: రాహుల్ మరో ఘనత.. పుజారా చెత్త రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.