ETV Bharat / sitara

మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న.. సీ'రియల్' కపుల్​!

author img

By

Published : Aug 24, 2021, 2:48 PM IST

Updated : Aug 24, 2021, 3:04 PM IST

Sravanamasam Vachindamma Show Latest Promo
రీల్​ కపుల్​ రియల్​ కపుల్​గా​ మారిన వేళ!

ఎల్లపుడూ సరికొత్త కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తోన్న 'ఈటీవీ'.. ఆదివారం మరో కొత్త కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. శ్రావణమాసం సందర్భంగా సీరియల్​ సెలబ్రిటీలతో 'శ్రావణమాసం వచ్చిందమ్మా' అనే షోను ప్లాన్​ చేసింది.

క్వాలిటీ షోలు, సరికొత్త సీరియల్స్​తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోంది 'ఈటీవీ'. ఈ క్రమంలోనే కుటుంబ ప్రేక్షకులను మరింతగా అలరించేందుకు ఆదివారం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'శ్రావణమాసం వచ్చిందమ్మా' అనే పేరుతో ఓ సరికొత్త షో ఈ ఆదివారం(ఆగస్టు 29) ప్రసారం కానుంది. ఇందులో పలువురు సెలబ్రిటీలతో పాటు సీరియల్​ నటీనటులు పాల్గొని సందడి చేశారు.

ఉర్రూతలూగించే ఆటపాటలతో.. జోష్​ఫుల్​ ఎంటర్​టైన్మెంట్​తో.. 'అభిషేకం' సీరియల్​ హీరోహీరోయిన్లు మధు-ప్రియల పెళ్లి సంబరాలతో.. పవిత్ర శ్రావణమాస సందర్భంగా ప్రేక్షకులను అలరించేందుకు 'శ్రావణమాసం వచ్చిందమ్మా' షో వచ్చేస్తోంది. ఈ కార్యక్రమం ఆదివారం రాత్రి 7 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ షో ప్రోమోను చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. మాస్​లుక్​తో లక్ష్య ఫస్ట్​లుక్​.. సీటీమార్​ రిలీజ్​ డేట్​

Last Updated :Aug 24, 2021, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.