ETV Bharat / sitara

రిషీ కపూర్​కు​ అస్వస్థత- ఆస్పత్రిలో చేరిక

author img

By

Published : Apr 30, 2020, 6:47 AM IST

Updated : Apr 30, 2020, 7:04 AM IST

Rishi Kapoor admitted to hospital
ఆస్పత్రిలో బాలీవుడ్​ దిగ్గజ నటుడు రిషీ కపూర్​

అనారోగ్యంతో బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీ కపూర్​ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే క్యాన్సర్​తో పోరాడుతున్న ఈయన... తాజాగా శ్వాసకోస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.

బాలీవుడ్​ దిగ్గజ నటుడు రిషీ కపూర్​... అకస్మాతుగా అస్వస్థతకు గురికావడం వల్ల బుధవారం ముంబయిలోని హెచ్​ ఎన్​ రిలయన్స్​ ఆస్పత్రిలో చేరారు. కొన్నాళ్లుగా క్యాన్సర్​తో పోరాడుతున్న ఈయన... తాజాగా శ్వాసకోస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అందుకే ఆస్పత్రిలో చేరినట్లు తెలిపాడు ఆయన సోదరుడు రణ్​ధీర్​ కపూర్​.

గతేడాది సెప్టెంబరులోనే క్యాన్స్​ర్​కు చికిత్స తీసుకుని అమెరికా నుంచి భారత్​కు తిరిగి వచ్చారు రిషీ కపూర్​. ఆ తర్వాత వైరల్​ ఫీవర్​, ఇన్​ఫెక్షన్​ వంటి సమస్యలతో ఫిబ్రవరిలో రెండు సార్లు ఆస్పత్రిలో చికిత్స పొందారు.

అయితే ఎప్పుడు సోషల్​మీడియాలో చురుగ్గా ఉండే ఈయన... ఏప్రిల్​ 2వ తేదీ నుంచి ఆయన ట్విట్టర్​ ఖాతాలో ఎటువంటి పోస్ట్​ చేయలేదు. ఇటీవల 'ది ఇన్​టర్న్' అనే హాలీవుడ్​ సినిమాలో నటించనున్నట్లు తెలిపారు రిషీకపూర్​. ​

Last Updated :Apr 30, 2020, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.