ETV Bharat / sitara

'రాజమౌళితో పని చేయడం సవాల్.. కష్టమైనా ఇష్టపడి చేశా'

author img

By

Published : Dec 28, 2021, 9:27 PM IST

ఆర్​ఆర్​ఆర్​ ఎన్టీఆర్​, RRR NTR
ఆర్​ఆర్​ఆర్​ ఎన్టీఆర్​

NTR about Rajamoli: దర్శకుడు రాజమౌళితో పనిచేయం ఓ సవాల్​ లాంటిదని చెప్పారు హీరో ఎన్టీఆర్​. 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలో తాను ఎంతో అవగాహనతో నటించినట్లు తెలిపారు. కాగా, ఈ సినిమా తర్వాత మల్టీస్టారర్​ చిత్రాల జోరు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

NTR about Rajamoli: 'ఆర్​ఆర్​ఆర్​' సినిమాలో తాను ఎంతో అవగాహనతో నటించినట్లు తెలిపారు హీరో ఎన్టీఆర్​. తనవంతుగా బెస్ట్ పర్​ఫార్మెన్స్​​ ఇవ్వడం తన బాధ్యత అని చెప్పారు.

"ప్రతిరోజు కష్టంగా అనిపించేది. కానీ మనపై ఒత్తిడి లేకపోతే మనుగడ సాగించలేం. మనల్ని నమ్మి ఒకరు పెట్టుబడి పెట్టారని, ఒకరి విజన్​లో మనం భాగస్వామ్యం అయ్యామని గుర్తంచుకోవాలి. డబ్బులు విషయాన్ని పక్కనపెడితే మనపై నమ్మకం ఉంచినప్పుడు దానికి న్యాయం చేయాలి. అది మన బాధ్యత." అని తారక్​ అన్నారు.

రాజమౌళితో పనిచేయడం సవాల్​లాంటిదని పేర్కొన్నారు ఎన్టీఆర్​. 'ఆర్​ఆర్​ఆర్'​ తర్వాత మల్టీస్టారర్​ చిత్రాల జోరు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. "చిత్రయూనిట్​లోని మిగతా సిబ్బంది విరామం తీసుకున్నప్పటికీ రాజమౌళి నిరంతరం పనిచేసేవారు. మమల్ని పిలిచి సన్నివేశాల గురించి చర్చించేవారు. దీనిద్వారా నేనెప్పుడూ పాత్రలోనే లీనమైఉండేవాడిని. ఆయనతో పనిచేయడం సవాల్​. నేను కూడా దానెప్పుడూ ఇష్టపడతాను. దర్శకుడిగా తానేంటో నిరూపించుకునేందుకు ఎప్పుడూ తనకు తానే సవాల్​ విసురుకుంటూ పనిచేస్తారు. మనలోని నటన నైపుణ్యాన్ని 50, 80 శాతం ఇస్తే సరిపోదు 100శాతం ఆయనకు ఇవ్వాలి. అప్పుడే తను సీట్​లో నుంచి లేచి వచ్చి ఓకే అంటారు. 'ఆర్​ఆర్​ఆర్'​ తర్వాత మల్టీస్టారర్​ చిత్రాల హవా పెరుగుతుందని భావిస్తున్నా. నాకు తెలిసి చాలా చీత్రసీమల్లో ఇద్దరు హీరోల కాంబినేషన్స్​లో సినిమాలు చేయడం ఆపేశారు. హిందీలో 'కరణ్​అర్జున్'​ తర్వాత ఇద్దరు స్టార్​ హీరోలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ మల్టీస్టారర్​ చిత్రాలు రాలేదు. ఎందుకు రాలేదు అంటే నా దగ్గర సమాధానం లేదు. కానీ ఇకపై వస్తాయని అనుకుంటున్నాను. అది మాతోనే ప్రారంభం అవ్వడం గర్వంగా భావిస్తున్నాను" అని ఎన్టీఆర్​ చెప్పుకొచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'లో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో సినిమాను నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇదీ చూడండి: మా అమ్మ ఆ విషయం చెప్పలేదు: చరణ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.