ETV Bharat / sitara

Mahesh Babu: అభిమానుల కోసం మహేశ్​ పక్కా ప్లాన్

author img

By

Published : Sep 9, 2021, 5:31 AM IST

mahesh babu
మహేశ్​బాబు

అభిమానుల వరుసగా సినిమాలు చూపించేందుకు మహేశ్​ సిద్ధమవుతున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్​ పూర్తిచేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చేస్తున్న సూపర్​స్టార్.. తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తారు.

'సరిలేరు నీకెవ్వరు' విజయంతో దూకుడు మీదున్నారు స్టార్​హీరో మహేశ్‌బాబు. అదే వేగంతో తన తర్వాతి చిత్రం 'సర్కారువారి పాట'(sarkaru vaari paata) పూర్తి చేద్దామనుకున్నా, ఆ స్పీడ్‌కు కరోనా(coronavirus) బ్రేక్‌లు వేసింది. ప్రస్తుతం షూటింగ్‌లకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం వల్ల ఈ సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. దర్శకుడు పరుశురామ్‌ వర్కింగ్‌ స్టైల్‌ కూడా అదే కావడం వల్ల సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందట.

mahesh babu sarkaru vaari paata
మహేశ్ సర్కారు వారి పాట మూవీ

'సరిలేరు నీకెవ్వరు' తర్వాత గ్యాప్‌ వచ్చినట్లు ఈ సారి రాకుండా చూసుకుందామని మహేశ్‌(mahesh sarkari vari pata) ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 'సర్కారు వారి పాట' పూర్తి చేసి, విరామం తీసుకోకుండా వెంటనే త్రివిక్రమ్‌(trivikram mahesh movie) క్యాంప్‌లోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నారు. అన్నీ కుదిరితే నవంబర్‌ నుంచి ఈ సినిమా షూటింగ్‌ షురూ కానున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో మహేశ్‌-త్రివిక్రమ్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డేను ఇప్పటికే ఎంపిక చేశారు.

'సర్కారు వారిపాట'లో కథానాయికగా కీర్తి సురేశ్‌(keerthy suresh) నటిస్తోంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.