ETV Bharat / sitara

'సాయిపల్లవి కంటే రష్మిక అందానికే జోహార్లు'

author img

By

Published : Mar 1, 2022, 8:00 PM IST

sharwanand rashmika
శర్వానంద్ రష్మిక

Aadavallu meeku joharlu release date: సాయి పల్లవి కంటే రష్మిక అందం, అభినయానికే తన జోహార్లని హీరో శర్వానంద్ తెలిపారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ నెల 4న చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాలో నటించిన ప్రధాన నటీనటులతో ప్రముఖ వ్యాఖ్యాత సుమ సాగించిన ఇంటర్వ్యూ సరదా సరదాగా సాగింది.

Aadavallu meeku joharlu release date: శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో నటించిన ప్రధాన నటీనటులతో ప్రముఖ వ్యాఖ్యాత సుమ సాగించిన సరదా సరదా ముచ్చట్లు మీకోసం.

సాయి పల్లవి కంటే రష్మిక అందం, అభినయానికే తన జోహార్లని హీరో శర్వానంద్ తెలిపారు. తన ప్రతి సినిమాలో తల్లి క్యారెక్టర్​ 'రాధిక'నే ఉండాలని కోరారు శర్వానంద్. ఇక 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఓ ఫీల్​గుడ్ సినిమా అని సీనియర్ నటి రాధిక అన్నారు.

"మంచి కథతో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రమిది. టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమాలో మహిళలకు ఎంతో ప్రాధాన్యముంది. శర్వా, రష్మికల జంటకు మంచి మార్కులు పడతాయి" అని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు.

శర్వానంద్ రష్మిక ఇంటర్వ్యూ

ఐదుగురు తల్లులను ఒప్పించి చిరు అనే యువకుడు తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లాడనే కథాంశంతో ఈ చిత్రం తెరెకక్కింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఖుష్బూ, రాధిక శరత్‌ కుమార్‌, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇవీ చూడండి:

'కచ్చా బాదమ్'​ సింగర్​కు రోడ్డు ప్రమాదం!

తమిళ నటి అరుదైన ఘనత.. అమెరికన్ ఆర్మీలో లాయర్​గా చేరిక

అలరిస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ట్రైలర్‌.. హిందీలో రామ్​-నితిన్​ హవా!

ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.