ETV Bharat / jagte-raho

బెట్టింగులకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్​.. నగదు స్వాధీనం

author img

By

Published : Oct 18, 2020, 7:34 PM IST

Four arrested for betting in parakala
బెట్టింగులకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్​.. నగదు స్వాధీనం

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆన్​లైన్​ ద్వారా ఐపీఎల్​ క్రికెట్​ బెట్టింగ్​కు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 సెల్​ఫోన్లు, రూ.16,100 నగదు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్​ రూరల్​ జిల్లా పరకాల పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్​ సమీపంలో గల గణపతి టింబర్ డిపో వద్ద ఐపీఎల్​ బెట్టింగ్​లు నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పరకాల సీఐ మహేందర్​ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆన్​లైన్​లో బెట్టింగ్​లకు పాల్పడుతున్న తండా మహేష్, పూసల రాజేష్, కొమ్ముల అజయ్ కుమార్, కుక్కల సత్యరాజు అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 సెల్​ఫోన్లు, రూ.16,100 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను పోలీస్​స్టేషన్​కు తరలించి.. కేసు నమోదు చేశారు.

బెట్టింగ్ ఆడుతున్న వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పరకాల పోలీస్​ సిబ్బందిని ఏసీపీ శ్రీనివాస్ అభినందించారు.

ఇవీ చూడండి: చిన్నమ్మను హత్య చేసింది.. రెండేళ్ళ తర్వాత దొరికింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.