ETV Bharat / jagte-raho

బీమా సొమ్ము కోసం భర్తను చంపిన ఇల్లాలు

author img

By

Published : Jun 22, 2020, 9:15 PM IST

a wife brutally murder her husband for insurance amount
బీమా సొమ్ము కోసం భర్తను చంపిన ఇల్లాలు

వరంగల్ గ్రామీణజిల్లా పర్వతగిరి మండలంలో ఈనెల 19న జరిగిన హత్యోదంతాన్ని పోలీసులు ఛేదించారు. బీమా సొమ్ము కోసం మృతుడి భార్య యాకమ్మే హత్య చేసినట్లు నిర్ధరించారు.

బీమా సొమ్ముకు ఆశపడి తాగుడుకు బానిసైన భర్తను కుటుంబ సభ్యులతో కలిసి కిరాతకంగా అంతమొందించిన ఘటన వరంగల్​ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలంలో జరిగింది. ఈనెల 19న జరిగిన హత్య కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఘటన జరిగిన 12 గంటల్లోనే కేసును ఛేదించారు.

హత్యా తండాకు చెందిన వీరన్న తాగుడుకు బానిసయ్యాడని... ఆయన భార్య యాకమ్మ తన అన్నా వదినలతో కలసి వీరన్నను హత్యచేసిట్లు పోలీసులు తెలిపారు. స్థానిక సహకార బ్యాంక్​లో 20 లక్షల రూపాయలకు భర్త పేరుపై ఇన్సూరెన్స్​ చేయించారని... అతడు చనిపోతే ఇన్సూరెన్స్​ సొమ్మును తీసుకోవచ్చనే ఉద్దేశంతోనే భర్తను హత్య చేసిందని వివరించారు. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించినట్లు డీసీపీ వెంకటలక్ష్మి తెలిపారు.

బీమా సొమ్ము కోసం భర్తను చంపిన ఇల్లాలు

ఇదీ చూడండి: విద్యుదాఘాతంతో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.