ETV Bharat / jagte-raho

విద్యుదాఘాతంతో ఉప సర్పంచ్ మృతి

author img

By

Published : Aug 12, 2020, 9:01 PM IST

విద్యుదాఘాతంతో ఉప సర్పంచ్ మృతి
విద్యుదాఘాతంతో ఉప సర్పంచ్ మృతి

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన చెన్నూరు మండలం పొన్నారంలో జరిగింది. గ్రామ ఉపసర్పంచ్​ శేఖర్​ మృతి చెందాడు.

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొన్నారంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. గ్రామ ఉపసర్పంచ్​ శేఖర్...​ తన అన్నయ్య ఇంటిలో విద్యుత్​ బోర్డు మరమ్మతు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో శేఖర్​ అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు.

హుటాహుటిన చెన్నూరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. శేఖర్​ మృతితో కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.