ETV Bharat / jagte-raho

భూ తగాదాలు: గొడ్డలితో నరికి చంపారు!

author img

By

Published : Dec 10, 2020, 1:23 PM IST

Updated : Dec 10, 2020, 7:00 PM IST

భూ తగాదాలు: గొడ్డలితో నరికి చంపారు!
భూ తగాదాలు: గొడ్డలితో నరికి చంపారు!

13:19 December 10

భూ తగాదాలు: గొడ్డలితో నరికి చంపారు!

     భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణంగా గొడ్డలితో నరికి చంపిన ఘటన కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో చోటుచేసుకుంది. డీసీపీ శ్రీనివాస్‌, ఏసీపీ శ్రీనివాస్‌ రావులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రాసమల్ల సంపత్‌, అదే గ్రామానికి చెందిన బోనగిరి ఓదేలుకు మధ్యలో భూ వివాదం జరుగుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయన్నారు. అధికారులతో భూ సర్వేను కూడా నిర్వహించారని డీసీపీ పేర్కొన్నారు. శుక్రవారం కూడా పంచాయితీ పెట్టుకునేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. ఈ క్రమంలో సంపత్ పొలంలో పని చేసుకుంటుండగా, ఓదేలు ఘర్షణకు దిగినట్లు ఆయన చెప్పారు.

         ఓదేలు కుమారుడు జంపయ్య గొడ్డలితో దాడి చేయగా సంపత్‌ అక్కడిక్కడే మృతి చెందాడని డీసీపీ శ్రీనివాస్​ తెలిపారు. సమాచారం అందుకున్న సీఐలు కిరణ్‌, రాములు, సృజన్‌రెడ్డి, ఎస్సైలు ప్రశాంత్‌రావు, కిరణ్‌రెడ్డి, సతీష్‌, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబీకులు, గ్రామస్థులతో మాట్లాడారు. పలు వివరాలు అడిగి తెలుసుకొన్నారు. తమకు న్యాయం చేయాలని మృతుని కుటుంబీకులు పోలీసులను వేడుకొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని బంధువుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి: ఈశ్వర్​నగర్​లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Last Updated :Dec 10, 2020, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.