ETV Bharat / international

US On Pakistan Church Attack : పాక్‌లో విధ్వంసం.. ఐదు చర్చిలపై దాడులు.. అమెరికా ఆందోళన

author img

By

Published : Aug 17, 2023, 10:23 AM IST

us on pakistan church attack
us on pakistan church attack

US On Pakistan Church Attack : పాకిస్థాన్‌లో చర్చి​లపై దాడి జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. శాంతియుత భావప్రకటనా స్వేచ్ఛకు మద్దతివ్వాలని పాకిస్థాన్​ అధికారులను కోరింది.

US On Pakistan Church Attack : పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్​లో ఐదు చర్చి​లపై దాడి జరిగిన ఘటనపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఘటనపై విచారణ జరిపి.. శాంతియుత భావప్రకటనా స్పేచ్ఛకు మద్దతివ్వాలని పాకిస్థాన్​ అధికారులను కోరింది. హింస, బెదిరింపులకు పాల్పడడం ఎప్పటికీ ఆమోదయోగ్యమైన వ్యక్తీకరణ కాదని తెలిపింది.

'శాంతియుత భావప్రకటనా స్వేచ్ఛకు మద్దతు ఇస్తున్నాం'
Church Burning Pakistan US Responds : "ఖురాన్​ను అవమానించారన్న ఆరోపణలతో పాకిస్థాన్​ చర్చిలపై దాడులు జరిగిన ఘటనపై ఆందోళన చెందుతున్నాం. మేం శాంతియుత భావప్రకటనా స్వేచ్ఛకు మద్దతు ఇస్తున్నాం. మతపరమైన ప్రేరేపిత హింసాత్మక ఘటనల పట్ల ఎల్లప్పుడూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపాలని పాక్​ అధికారులను కోరుతున్నాం" అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అయితే చర్చి​లపై దాడి జరిగినప్పుడు.. పోలీసులు మౌనంగా ఉండిపోయారని క్రైస్తవ నాయకులు ఆరోపించారు. క్రిస్టియన్లను హింసిస్తున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని పాకిస్థాన్ చర్చ్ ప్రెసిడెంట్ బిషప్ ఆజాద్ మార్షల్ ఆరోపణలు చేశారు. తమపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. మైనారిటీలపై దాడులకు దిగేవారినీ, చట్టాన్ని ఉల్లంఘించేవారిని కఠినంగా శిక్షిస్తామని పాక్‌ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వరుల్‌ హక్‌ కాకర్‌ హెచ్చరించారు.

ఏం జరిగిందంటే?
Pakistan Church Attack : పంజాబ్‌ ప్రావిన్స్​లోని జరాన్‌ వాలాలో ఓ క్రైస్తవుడు, అతని సోదరి ఖురాన్‌ను అవమానించారని ఆరోపిస్తూ ముస్లిం వర్గానికి చెందిన కొందరు బుధవారం ఐదు చర్చిలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు.. పాక్‌ సరిహద్దు భద్రతా దళమైన రేంజర్స్‌ సాయం కోరారు. క్రైస్తవుడైన రజా అమీర్‌ మసీహ్‌, అతడి సోదరి రాకి ఖురాన్‌ను, మహమ్మద్‌ ప్రవక్తను దూషించారంటూ మసీదుల మైకుల్లో ప్రచారం చేయడం వల్ల.. ముస్లింలు గుంపుగా వెళ్లి వారి ఇంటిని కూల్చివేశారని స్థానికులు చెప్పారు. దీంతో భయాందోళనకు గురైన క్రైస్తవులు వేరే ప్రాంతాలకు పరారయ్యారు. మసిహ్‌, అతడి సోదరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక ముస్లింలకు నచ్చచెప్పి ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Pakistan National Assembly Dissolved : పాక్​ జాతీయ అసెంబ్లీ రద్దు.. ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా?

పార్టీ మీటింగ్​లో పేలుడు.. 44 మంది మృతి.. 150 మందికి పైగా గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.