ETV Bharat / international

అక్కడ లీటర్​ పెట్రోల్​ రూ.420, డీజిల్ రూ.400!

author img

By

Published : May 24, 2022, 12:08 PM IST

srilanka crisis:
srilanka crisis

srilanka crisis: ఆర్థిక, ఆహార సంక్షోభంలో చిక్కుకుని సతమతమవుతున్న లంకేయులకు.. ఇంధన ధరలు మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇంధన కొరతతో ఇబ్బందులుపడుతున్న లంక వాసులకు కొండెక్కి కూర్చున్న పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా శ్రీలంక సర్కారు పెట్రోల్‌పై 82, డీజిల్‌పై 111 రూపాయల మేర ధరలను పెంచగా ఈ పెంపుతో లీటర్ పెట్రోల్ 420 రూపాయలకు, లీటర్ డీజిల్ 400 రూపాయలకు చేరింది.

srilanka crisis: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విల్లవిల్లాడుతున్న శ్రీలంకలో.. ఇంధన ధరలు చుక్కలను అంటుతున్నాయి. పెట్రోల్ ధరను 24.3 శాతం, డీజిల్ ధరను 38.4 శాతం మేర పెంచుతూ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో అధికంగా వినియోగించే ఆక్టేన్ 92 రకం పెట్రోల్‌పై లీటర్‌మీద 82 రూపాయలు పెంచింది. లీటర్ డీజిల్ ధరను 111 రూపాయల ‌మేరకు పెంచారు. తాజా పెంపుతో శ్రీలంకలో లీటర్ పెట్రోల్ 420 రూపాయలకు, లీటర్ డీజిల్ ధర 400 రూపాయలకు చేరింది. ఏప్రిల్ 19 తర్వాత శ్రీలంకలో ఇంధన ధరలు పెంచడం ఇది రెండోసారి.

ఇంధన కొరత కారణంగా పెట్రోల్ బంకుల వద్ద లంకేయులు బారులు తీరుతున్న నేపథ్యంలో శ్రీలంక సర్కారు పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిర్ణయించింది. దీనితో పాటు రవాణా, ఇతర సర్వీసు ఛార్జీల సవరణకు శ్రీలంక కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంధన ధరల పెంపుతో ఆటోరిక్షా కార్మికులు సైతం రేట్లు పెంచనున్నట్లు ప్రకటించారు. మొదటి కిలోమీటర్‌కు 90 రూపాయలు, ఆపై ప్రతి కిలోమీటర్‌కు 80 రూపాయల మేరకు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఖర్చులను తగ్గించే చర్యల్లో భాగంగా.. భౌతికంగా ఏయే ఉద్యోగులు విధులకు హాజరు కావాలనే విషయమై అవసరమైన విచక్షణాధికారాన్ని ఆయాశాఖల విభాగాధిపతులకు అప్పగించాలని శ్రీలంక సర్కారు నిర్ణయం తీసుకుంది. మిగతా వారు ఇంటి నుంచే పనిచేస్తారని తెలిపింది. మరోవైపు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చదవండి: శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత.. 40వేల టన్నుల డీజిల్ పంపిన భారత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.