ETV Bharat / international

Joe Biden India Tour Complete : భారత్​ నుంచి బైడెన్​ తిరుగు ప్రయాణం.. గాంధీకి నివాళులు అర్పించి వియత్నాంకు పయనం

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 1:05 PM IST

Updated : Sep 10, 2023, 1:39 PM IST

us-president-joe-biden-departure-from-india-after-concluding-two-day-visit-to-india-for-g20-summit-2023
భారత్​ నుంచి తిరుగు ప్రయాణమైన బైడెన్​

Joe Biden India Tour Complete : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత దేశ పర్యటన ముగిసింది. ఆదివారం ఉదయం రాజ్​ఘాట్​లో ఉన్న మహాత్మా గాంధీ సమాధికి నివాళులు అర్పించి.​. నేరుగా వియత్నాం బయలుదేరి వెళ్లారు. దిల్లీ వేదికగా రెండురోజులపాటు జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు బైడెన్​ హాజరయ్యారు.

Joe Biden India Tour Complete : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ భారత్​ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం జీ20 సమావేశాలు ముగించుకుని నేరుగా వియత్నాంకు బయలుదేరారు.
శనివారం నుంచి రెండు రోజుల పాటు దిల్లీలో జరిగిన జీ20 సమావేశాలకు బైడెన్ హాజరయ్యారు. అనంతరం సదస్సును ముగించుకుని ఆదివారం ఉదయం వియత్నాం పయనమయ్యారు. అంతకుముందు దిల్లీలోని రాజ్​ఘాట్​లో ఉన్న మహాత్మా గాంధీ సమాధికి.. మిగతా జీ20 నేతలు, ప్రధాని మోదీతో కలిసి నివాళులు అర్పించారు బైడెన్​.

Modi Biden Bilateral Talks : జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం భారత్​కు వచ్చారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్​కు వచ్చిన ఆయన​.. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లారు. అక్కడ బైడెన్​కు మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నేతలిద్దరూ పలు అంశాలపై చర్చించారు. బైడెన్​తో భేటీతో ఫలప్రదంగా జరిగిందని.. భారత్​- అమెరికా ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచే అనేక అంశాలపై చర్చించినట్లు ఎక్స్​లో ఓ పోస్ట్​ చేశారు మోదీ. రెండు దేశాల మధ్య స్నేహం ప్రపంచానికి మేలు చేసేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఇరు దేశాల మధ్య ఒప్పందాలు..
White House Joint Statement India : చర్చల అనంతరం అమెరికా, భారత్​ మధ్య పలు అంశాలపై ఒప్పందాలు కుదిరినట్లు శ్వేత సౌధం వెల్లడించింది. అమెరికా నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌, భారత బయోటెక్నాలజీ విభాగం మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. బయోటెక్నాలజీ, బయో మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆవిష్కరణల్లో సహకారంతోపాటు శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనలో కలిసి పనిచేసేందుకు ఇరు దేశాధినేతలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. సైబర్‌ సెక్యూరిటీ, రవాణా వ్యవస్థ, గ్రీన్‌ టెక్నాలజీ రంగాల్లో సహకారం కోసం ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.

G 20 Meeting in India 2023 : దిల్లీ వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో రెండురోజులపాటు జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. దిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగిన సదస్సుకు జీ20 దేశాల నేతలు హాజరయ్యారు. జీ-20లో మొత్తం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్‌ కలిపి మొత్తం 20 దేశాల ప్రభుత్వాలు సభ్యులుగా ఉన్నాయి. కొత్తగా ఆఫ్రికన్ యూనియన్​కు శాశ్వత సభ్యత్వం కల్పించారు.

Rishi Sunak Visits Akshardham Temple : అక్షర్​ధామ్ ఆలయంలో సునాక్​ దంపతుల పూజలు.. హరిత నిధికి 2 బిలియన్ డాలర్ల విరాళం

Modi Sunak Bilateral Talks : రిషి సునాక్​తో మోదీ ద్వైపాక్షిక చర్చలు.. బైడెన్​తో బంగ్లా ప్రధాని సెల్ఫీ

Last Updated :Sep 10, 2023, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.