ETV Bharat / international

ఐరాస మానవహక్కుల మండలికి మరోసారి భారత్​

author img

By

Published : Oct 14, 2021, 10:40 PM IST

UN Human Rights Council
మానవ హక్కుల మండలి

ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల మండలికి (UN Human Rights Council) మరోసారి ఎన్నికైంది భారత్​. 2022-24 కాలానికి గానూ భారీ మెజారిటీతో మండలిలో భారత్​ చోటు దక్కించుకుంది.

2022-24 కాలానికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల మండలికి (UN Human Rights Council) గురువారం మరోసారి ఎన్నికైంది భారత్. ఈ సందర్భంగా మానవ హక్కుల ప్రచారం, పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని (UNHRC India Member) ప్రమాణం చేసింది.

"భారీ మెజారిటీతో ఐరాస మానవ హక్కుల మండలికి 6వ సారి భారత్​ ఎన్నికైంది. భారత్​పై విశ్వాసముంచిన యూఎన్ (UN Human Rights Council News) సభ్య దేశాలకు కృతజ్ఞతలు. 'సమ్మాన్​, సంవాద్, సహ్యోగ్' నినాదంతో మానవ హక్కుల పరిరక్షణకు భారత్​ కృషి కొనసాగుతుంది," అని ఐరాసకు భారత శాశ్వత మిషన్ ట్వీట్ చేసింది.

ఇదీ చూడండి: 'చట్టాలను ఉల్లంఘించకుండా అఫ్గాన్​ను ఆదుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.