భారత వైమానిక దళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. ఫ్రాన్స్ రూపొందించిన రఫేల్ యుద్ధ విమానం భారత్ చేతికి అందింది. ఫ్రాన్స్ లోని బోర్డియాక్స్ లో డసోల్ట్ ఏవియేషన్ కర్మాగారంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ రఫేల్ ను అధికారికంగా స్వీకరించారు.
రఫేల్ ను అందుకున్న అనంతరం విమానానికి రాజ్నాథ్ ఆయుధ పూజ నిర్వహించారు. భారత్కు మొత్తం 36 విమానాలు అందనుండగా ఇది తొలి విమానం.
ఇదీ చూడండి: 400 ఏళ్ల నాటి ఉత్సవం... మైసూరు దసరా ప్రత్యేకం!