ETV Bharat / international

Taliban news: రుచిగా వండలేదని మహిళ ఒంటికి నిప్పంటించిన తాలిబన్లు!

author img

By

Published : Aug 21, 2021, 12:31 PM IST

A woman was set on fire by Taliban fighters who didn't like the food they forced her to cook
రుచిగా వండలేదని మహిళ ఒంటికి నిప్పుంటించిన తాలిబన్లు

తాలిబన్ల అరాచకాలు(Afghan Taliban) తట్టుకోలేక అఫ్గాన్ ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్నారు. ఆహారం రుచిగా వండలేదనే కారణంతో ఓ మహిళ ఒంటికి వారు నిప్పంటించినట్లు అప్గాన్​ మాజీ జడ్జి తెలిపారు. జిహాదీలను పెళ్లి చేసుకోవాలని యువతులను బలవంతం చేస్తున్నారని, మహిళలను శవపేటికల్లో బంధించి ఇతర దేశాలకు తరలించి సెక్స్ బానిసలుగా మారుస్తున్నారని వెల్లడించారు.

తాలిబన్ల కబంధ హస్తాల్లో(Afghan Taliban) చిక్కుకున్న అఫ్గానిస్థాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. వారి అరాచకాలను భరించలేక నరకం అనుభవిస్తున్నారు. తాము చెప్పిన విధంగా ఆహారం రుచిగా వండలేదనే కారణంతో ఓ మహిళ ఒంటికి తాలిబన్లు నిప్పంటించారని అఫ్గాన్ మాజీ జడ్జి నజ్లా అయుబి తెలిపారు. మంగళవారం జరిగిన ఈ ఘటన గురించి ఓ టీవీ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు.

జిహాదీలను పెళ్లి చేసుకోవాలని అఫ్గాన్​ యువతులను తాలిబన్లు బలవంతం((Afghan Taliban Crisis) చేసి వేధిస్తున్నారని నజ్లా తెలిపారు. మహిళలను శవపేటికల్లో బంధించి ఇతర దేశాలకు తరలిస్తున్నారని, అక్కడ వారిని సెక్స్​ బానిసలుగా మారస్తున్నారనే భయానక విషయాలను చెప్పారు.

అధికారం చేపట్టిన ఐదు రోజుల్లోనే తాలిబన్ల పాలన ఎంత దారుణంగా ఉంటుందో ప్రపంచానికి తెలుస్తోంది. కాబుల్​లో అడుగడుగునా తుపాకులతో మోహరించిన వారు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. జాతీయ జెండా పట్టుకున్న ప్రజలను చితకబాదుతున్నారు. రోడ్డుపైకి వచ్చిన యువకులపై దాడి చేస్తున్నారు. మహిళలను వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగే అరాచకాలను నజ్లా వివరించారు.

అధికారం చేపట్టాక ప్రతీకార దాడులకు దిగబోమని, మహిళా హక్కులకు భంగం కలిగించబోమని తాలిబన్ల అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ మంగళవారం హామీ ఇచ్చారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. దేశవ్యాప్తంగా తాలిబన్లు భయానక చర్యలకు పాల్పడుతున్నారు.

ఊచకోత..

అఫ్గాన్​లో మైనారిటీలుగా ఉన్న హజారాలపై తాలిబన్లు మళ్లీ ఉక్కుపాదం మొపుతున్నారని 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌' సంస్థ వెల్లడించింది. గజనీ ప్రావిన్సులోని ముందరఖ్త్‌ గ్రామంలో గత నెల 4-6 తేదీల మధ్య హజారా వర్గం ప్రజలే లక్ష్యంగా దాడులకు తాలిబన్లు తెగబడినట్లు పేర్కొంది. తొమ్మిది మందిని చిత్రహింసలు పెట్టి దారుణంగా హత్య చేసినట్లు వెల్లడించింది.

పోలీస్​ ఉన్నతాధికారి దారుణ హత్య

మరోపైపు ఓ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారిని తాలిబన్లు అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు(Afghan Taliban News). అతని కళ్లకు గంతలు కట్టి, చేతులకు సంకెళ్లు వేసి మోకాళ్లపై కూర్చొబెట్టి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ హత్యకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్​లో వైరల్ అయింది.

ఇదీ చూడండి: Afghan crisis: అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రతీకారేచ్ఛ

Afghan Crisis: ఇళ్లల్లోకి దూరి.. చిత్రహింసలు పెట్టి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.