ETV Bharat / international

టెక్సాస్​లో 100 దాటిన మంచు తుపాను మృతులు

author img

By

Published : Mar 26, 2021, 8:58 AM IST

Texas death toll from February storm, outages surpasses 100
టెక్సాస్​లో 100 దాటిన మంచు తుపాను మృతులు

అమెరికాలో మంచు తుపాను వల్ల మరణించినవారి సంఖ్య 100 దాటినట్లు అక్కడి అధికారులు తెలిపారు. తుపానుకు తోడు, అత్యల్ప ఊష్టోగ్రతల వల్ల మృతులు మరింత పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

అమెరికా టెక్సాస్​ రాష్ట్రంలో మంచు తుపాను కారణంగా చనిపోయినవారి సంఖ్య పెరుగుతోంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 111 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఎక్కువ మంది అత్యల్ప ఉష్ణోగ్రత వల్లే మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్య విభాగం తెలిపింది. మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

తుపాను కారణంగా విద్యుత్​ సరఫరా నిలిచిపోయి దాదాపు 40 లక్షల మంది అంధకారంలో ఉన్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల.. పైపులైన్లలో నీరు గడ్డకట్టుకుపోయింది. తాగునీరు అందక లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు.

ఇదీ చూడండి: మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి బైడెన్​ సై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.