ETV Bharat / international

'మోటేరా సభ చూసిన తర్వాత ఏదీ పెద్దదిగా లేదు'

author img

By

Published : Mar 1, 2020, 6:02 PM IST

Updated : Mar 3, 2020, 2:02 AM IST

May never be excited about a crowd again after going to India says trump
'మోటేరా సభ చూసిన తర్వాత ఏదీ పెద్దదిగా లేదు'

భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు​. మోదీని గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. భారత పర్యటన తర్వాత ఏ సభలోనూ జనం కోసం అంతగా తపించడం లేదని అమెరికాలో జరిగిన ఓ ర్యాలీలో ట్రంప్​ వ్యాఖ్యానించారు.

భారత ఆతిథ్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ మరోసారి గుర్తుచేసుకున్నారు​. భారత ప్రజల మన్నన పొందిన గొప్ప నేతగా మోదీని అభివర్ణించారు. 'నమస్తే ట్రంప్' కార్యక్రమం చూసిన తర్వాత తాను జనం కోసం అంతగా ఆరాటపడటం లేదన్నారు. అమెరికా దక్షిణ కరోలినాలో జరిగిన ఓ ర్యాలీలో భారత పర్యటన విశేషాలు పంచుకున్నారు అమెరికా అధ్యక్షుడు.

"నేను భారత ప్రధానితో గడిపాను. మోదీ గొప్ప వ్యక్తి, ఆయన్ను అక్కడ ప్రజలు ఎంతో అభిమానిస్తున్నారు. అది గొప్ప విషయం. సాధారణంగా ఎక్కువ జనం ముందు ప్రసంగించడానికి ఇష్టపడతాను. ఇక్కడ ఏ సభలోనైనా 40- 60వేల మంది హాజరవుతారు. అయితే భారత్​ నుంచి వచ్చిన తర్వాత ప్రేక్షకుల కోసం అంతగా తపించడం లేదు."

-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

కుటుంబ సమేతంగా గత నెల 24, 25న భారత్​లో పర్యటించారు ట్రంప్​. ఇందులో భాగంగా అహ్మదాబాద్​లోని మోటేరా క్రికెట్​ మైదానంలో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ప్రసంగించారు.

ఇదీ చూడండి: కరోనా: దక్షిణ కొరియాలో ఇలా.. ప్రపంచవ్యాప్తంగా అలా

Last Updated :Mar 3, 2020, 2:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.