ETV Bharat / international

పెరిగిన వలసలు- మళ్లీ మెక్సికో సరిహద్దు మూసివేత

author img

By

Published : Mar 22, 2021, 6:10 AM IST

Biden administration tries to get control of border
పెరిగిన వలసలు- మళ్లీ మెక్సికో సరిహద్దు మూసివేత

సరిహద్దుల నుంచి అగ్రరాజ్యానికి మళ్లీ వలసలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జో బైడెన్​ సర్కార్​.. మెక్సికో సరిహద్దును మూసేసింది. సమస్య పరిష్కారానికి మార్గాలు అన్వేషిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో బైడెన్​ ప్రభుత్వం మెక్సికోవైపు సరిహద్దులను మూసివేసింది. అయితే ఈ కారణంగా మానవీయ, రాజకీయ సవాళ్లు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

పరిస్థితులను అదుపు చేయడానికి అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రి అలెజాండ్రో మేయర్​కోస్​ స్వయంగా అక్కడికి వెళ్లారు. మొత్తం కుటుంబంతో వచ్చినవారిని, ఒంటరిగా వచ్చిన పురుషులను అక్కడ నుంచి తిప్పి పంపిస్తున్నట్లు చెప్పారు. అయితే యువకులు, ఇబ్బంది పడుతున్న పిల్లలను మాత్రం పంపించడం లేదని తెలిపారు.

అలా చేస్తారనే..

మునుపటి అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. వలసల విషయంలో కఠినంగా వ్యవహరించగా, ఆ విధానాలను సవరిస్తారన్న ప్రచారం జరగడంతో చాలా దేశాల వారు సరిహద్దులకు చేరుకున్నారు. పొరుగున్న ఉన్న గ్వాటెమాల, హోండురస్​, ఎల్​సాల్వెడార్​లోని అంతర్గత గొడవల కారణంగా అక్కడ నుంచి కూడా భారీగానే వలస వచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: కీలక 'వలస' ఉత్తర్వులపై బైడెన్ సంతకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.