ETV Bharat / international

పడవ మునిగి.. 57 మంది జల సమాధి!

author img

By

Published : Jul 27, 2021, 7:59 AM IST

Migrant boat capsizes
పడవ మునిగి

లిబియాలో పడవ మునిగి 57 మంది వలసకూలీలు మృతిచెందినట్లు తెలుస్తోంది. పడవలో మొత్తం 75 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఉత్తర ఆఫ్రికాలోని లిబియాలో విషాద ఘటన జరిగింది. 75 మంది వలస కూలీలు ప్రయాణిస్తున్న పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో 57 మంది వలసకూలీలు మృతిచెంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వీరిలో 20 మంది మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

వాతావరణ ప్రతికూల ప్రభావం కారణంగా పడవ మునిగినట్లు అధికారులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.