ETV Bharat / entertainment

విరాటపర్వం ట్రైలర్​ అదిరింది.. 'రుణం తీర్చుకోవాలంటే అదే మార్గం'

author img

By

Published : Jun 5, 2022, 11:02 PM IST

d
d

రానా హీరోగా నటించిన 'విరాటపర్వం' ట్రైలర్​ రిలీజైంది. వెన్నెల పాత్రలో సాయిపల్లవి, రవన్న పాత్రలో రానాలను చూసుకుని ఫ్యాన్స్​ ఖుషీ అయిపోతున్నారు. మరోవైపు విక్రమ్​ సక్సెస్​పై ఆ సినిమా దర్శకుడు లోకేశ్​ కనకరాజ్​ భావోద్వేగ ట్వీట్​ చేశారు. దీనిపై స్పందించిన కమల్​ ఆసక్తికరమైన ట్వీట్​ చేశారు.

యూనివర్సల్​ స్టార్​ కమల్​హాసన్​ హీరోగా నటించిన చిత్రం 'విక్రమ్'.​ యువ దర్శకుడు లోకేశ్​ కనకరాజ్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్​ వస్తోంది. కమల్​, విజయ్​ సేతుపతి, ఫహద్​ ఫాజిల్​ నటన, సూర్య కేమియో, అనిరుధ్​ నేపథ్యసంగీతం.. కనకరాజ్​ దర్శకత్వం ప్రేక్షకులకు కట్టిపడేశాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి భావోద్వేగానికి గురైయ్యారు లోకేశ్.

"నేను ఈ స్థాయిలో ఎప్పుడూ భావోద్వేగానికి గురికాలేదు. విక్రమ్​ పట్ల​ మీరు చూపించిన ఆదరణ మర్చిపోలేనిది. మీరు చూపించిన ఈ ప్రేమకు ఎలా రుణం తీర్చుకోవాలో తెలియట్లేదు. కమల్​హాసన్​ సార్​కు.. ప్రజలకు కృతజ్ఞతలు." అని లోకేశ్​ ట్వీట్​ చేయగా.. అందుకు కమల్​ రిప్లై ఇచ్చారు.

  • The only way you can do any debt management with a loving audience is to never become complacent. Do honest back breaking work, they love and respect that. My energy comes from their love.All power to your endeavors. RKFI will proudly support you like we did this time. Rock on. https://t.co/C01Ek31QyG

    — Kamal Haasan (@ikamalhaasan) June 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రేక్షకుల ప్రేమకు రుణం తీర్చుకోవడానికి ఒక్కటే దారి ఉంది. నువ్వు ఎప్పుడూ నీ పనిపట్ల సంతృప్తి పడకు. ప్రతీసారి నిజాయతీగా మరింత కష్టపడు. దాని ఫలితమే వాళ్ల ఆదరణ, ప్రేమ. నా శక్తి కూడా వాళ్లే. రాజ్​కమల్​ నిర్మాణ సంస్థ నీకు ఎప్పుడూ అండగా ఉంటుంది."

-కమల్​ హాసన్​

రానా కథనాయకుడిగా నటించిన చిత్రం 'విరాటపర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్​గా నటించింది. తాజాగా చిత్రబృందం రిలీజ్​ చేసిన ట్రైలర్​కు మంచి రెస్పెన్స్​ వస్తోంది. వెన్నెల పాత్రలో సాయిపల్లవి, రవన్న పాత్రలో రానాలను చూసుకుని ఫ్యాన్స్​ ఖుషీ అయిపోతున్నారు. ప్రేమ, విప్లవం అంశాలతో సాగిన ఈ ట్రైలర్​ నెటిజెన్లను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఈనెల 17న విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విక్టరీ వెంకటేష్​, మెగాహీరో వరుణ్​ తేజ్​ కథానాయకులుగా నటించిన చిత్రం 'ఎఫ్​3'. ఇటీవల రిలీజ్​ అయిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్లు వందకోట్లను దాటాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.102 కోట్ల గ్రాస్​ వచ్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరోవైపు ఎఫ్​3 హిట్​ అయిన జోష్​లో దర్శకుడు అనిల్​ రావిపూడి 'ఎఫ్​4'కు కథను సిద్ధం చేసే పనిలో పడ్డట్టు సమాచారం.

ఇదీ చూడండి : 'అందుకే వాళ్లు జబర్దస్త్​కు దూరం'... ఒంటరినైపోయా అంటూ రాంప్రసాద్​ కన్నీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.