ETV Bharat / entertainment

KGFను బీట్​ చేసిన ఆదిపురుష్​.. అడ్వాన్స్​ బుకింగ్స్​కు అదిరిపోయే రెస్పాన్స్​!

author img

By

Published : Jun 11, 2023, 3:47 PM IST

Updated : Jun 11, 2023, 4:13 PM IST

Adipurush advance booking
Adipurush advance booking

Adipurush Advance Booking : విడుదలకు ముందే ఆదిపురుష్​ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్​ వస్తోంది. ఆడ్వాన్స్​ టికెట్​ బుకింగ్స్​కు రికార్డు స్థాయిలో స్పందన లభిస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​లో ముందస్తు బుకింగ్స్​లో కేజీఎఫ్​-2 రికార్డును 'ఆదిపురుష్​' బీట్​ చేసింది.

Adipurush Advance Booking : పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ నటించిన 'ఆదిపురుష్'​ చిత్రానికి విడుదలకు ముందే అదిరిపోయే రెస్పాన్స్​ వస్తోంది. ముందస్తు టికెట్​ బుకింగ్స్​ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా జూన్​ 16న విడుదల కానున్న సందర్భంగా కౌంట్​డౌన్​ ప్రారంభమయింది. అందులో భాగంగా భారత్​ సహా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్​ బుకింగ్స్​ను ప్రారంభించింది చిత్ర యూనిట్​.
సినీ వర్గాల సమాచారం ప్రకారం అమెరికాలో 187 ప్రాంతాల్లో 10, 727 టికెట్లు అమ్ముడుపోయాయి. దీంతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​లో కూడా 'ఆదిపురుష్​'.. భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ దేశాల్లో 'కేజీఎఫ్​-2' రికార్డులను 'ఆదిపురుష్​' బద్దలుగొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రముఖ టికెట్​ బుకింగ్​ వెబ్​సైట్ 'బుక్​ మై షో'లో కుడా అనూహ్య స్పందన లభిస్తోంది. ఆ సైట్​లో 5 లక్షలకు పైగా ఇంట్రెస్ట్స్ రిజిస్టర్​ అయ్యాయి.​ దీంతో ఈ సినిమా మొదటి రోజు భారీగానే కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. 'ఆదిపురుష్'​ సినిమాను అమెరికాలో జరగనున్న 'ట్రిబెకా ఫెస్టివల్‌'లో జూన్ 13న ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా హిందీ భాషలో దాదాపు 4000 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. హిందీ సహా దేశవ్యాప్తంగా 6,200 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు.

Adipurush Cast : ఇక 'ఆదిపురుష్'​ సినిమా విషయానికొస్తే.. రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఈ చిత్రంలో ప్రభాస్‌.. రాముడిగా నటించగా.. కృతి సనన్‌ సీత దేవి పాత్రలో కనిపించారు. లంకాధిపతి రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు. ఈ చిత్రం మొత్తం బడ్జెట్‌ దాదాపు రూ.400 కోట్లకుపైనే ఉంటుందని కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది.

ఆదిపురుష్ టికెట్లు ఉచితం..!
Adipurush Movie Tickets Free : 'ఆదిపురుష్' సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలాన్న లక్ష్యంతో తనవంతుగా 10 వేల టికెట్లు కొనుగోలు చేయనున్నారు రణ్​బీర్​ కపూర్​. ఓ ఎన్​జీవో సంస్థ ద్వారా ఆ టికెట్లను పేద పిల్లల ఇవ్వనున్నారని తెలిసింది. వారందరికీ హిందూ పురాణాలపై అవగాహన కల్పించాలనే ఆయన ఈ నిర్ణయం తీసుుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో రణ్​బీర్​పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కార్తికేయ-2, కశ్మీర్​ ఫైల్స్​ లాంటి చిత్రాల నిర్మాత అభిషేక్​ అగర్వాల్​ కూడా 10 వేల టికెట్లు ఉంచితంగా అందించేందుకు ముందుకొచ్చారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి ఈ టికెట్లను ఉంచితంగా అందించనున్నారు.

  • #Adipurush is a once in a lifetime movie which needs to be celebrated by one and all.

    Out of my devotion for Lord Shree Ram, I have decided to give 10,000+ tickets to the Government schools, Orphanages & Old Age Homes across Telangana for free.

    Fill the Google form with your… pic.twitter.com/1PbqpW9Eh6

    — Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) June 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Last Updated :Jun 11, 2023, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.