ETV Bharat / crime

శానిటైజర్​ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Mar 3, 2021, 9:38 AM IST

శానిటైజర్​ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
శానిటైజర్​ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

తల్లిద్రండ్రులు మందలించారని మనస్తాపంతో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేటకు చెందిన బాలిక... గిరిజన ఆశ్రమ పాఠశాలలో శానిటైజర్​ సేవించి బలవన్మరణానికి యత్నించింది.

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో శానిటైజర్​ సేవించింది.

కోటపల్లి మండలం లింగన్నపేటకు చెందిన బాలిక... బోనాల జాతర కోసం నాలుగురోజుల క్రితం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లింది. తిరిగి మంగళవారం మధ్యాహ్నం భోజన సమయానికి పాఠశాలకు వచ్చింది. పాఠశాలలో శానిటైజర్​ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాలికను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు మందలించడం వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని బాలిక తెలిపింది.

ఇదీ చూడండి: అమ్మ లేదని.. ఇక తిరిగిరాదని.. తెలియని ఓ పసిప్రాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.