ETV Bharat / crime

రన్నింగ్​లో ఉన్న కారు డోర్​ తీసిన యజమాని.. ఆ కాసేపటికే..

author img

By

Published : May 28, 2022, 6:44 PM IST

narsingi road accident
నార్సింగి రోడ్డు ప్రమాదం

Accident at Narsingi: మృత్యువు ఏ వైపు నుంచి ఎలా దూసుకువస్తుందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు.. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా ముందువెనకా ఉన్న వాహనదారులు.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా వారి నిర్లక్ష్యానికి ఇవతలి వాళ్లు బలి కావాల్సిందే. అలాంటి సంఘటనే హైదరాబాద్​ శివారులో చోటుచేసుకుంది. ఓ కారు యజమాని నిర్లక్ష్య డ్రైవింగ్​కు నిండు ప్రాణం బలైంది.

Accident at Narsingi: రంగారెడ్డి జిల్లా నార్సింగి అప్పా జంక్షన్​ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు యజమాని నిర్లక్ష్యం కారణంగా.. ఆ వెనుకే బైక్​పై వస్తున్న వ్యక్తి రక్తమోడుతూ మృతి చెందాడు. కారు రన్నింగ్​లో ఉండగా.. ఉమ్మి వేసేందుకు యజమాని ఎల్లయ్య అకస్మాత్తుగా కారు డోర్​ తీశాడు. ఇది గమనించని ద్విచక్రవాహనదారుడు ఒక్కసారిగా కారు డోర్​కు తగిలి గాల్లోకి ఎగిరి అవతలి వైపు రహదారిపై పడ్డాడు. అదే క్రమంలో అటుగా వస్తున్న లారీ.. అతనిపై నుంచి దూసుకెళ్లడంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడు ఆంధ్రప్రదేశ్​కు చెందిన మేస్త్రిగా గుర్తించారు. నిర్లక్ష్యంగా రన్నింగ్​ కారు డోరు తెరిచిన ఎల్లయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

narsingi road accident
ప్రమాదానికి కారణమైన కారు

ఇవీ చదవండి: ఆలయంలో విషాదం.. విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

'ఆప్​' సర్కార్​ మరో కీలక నిర్ణయం.. 424 మంది వీఐపీలకు భద్రత కట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.