ETV Bharat / crime

ప్రియుడితో కలిసి వివాహిత అనుమానాస్పద మృతి

author img

By

Published : Mar 1, 2021, 1:26 PM IST

lovers-suspected-death-nidadavolu-zone-west-godavari-distrcit
ప్రియుడితో కలిసి వివాహిత అనుమానాస్పద మృతి

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి ఓ వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో ప్రియుడితో కలిసి ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందారు. ఏలూరు నగరానికి చెందిన షేక్ నాగూర్​తో కుసుమ నాగసాయి కుమారికి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది. ఈ ప్రేమ వ్యవహారం కొనసాగుతుండగానే యువతి తల్లిదండ్రులు ఆమెని నిడదవోలు మండలం తాళ్లపాలెంకి చెందిన శ్రీనివాస్​కి ఇచ్చి పెళ్లి చేశారు. 2014లో పెళ్లి జరిగినప్పటికీ నాగసాయి కుమారి తన ప్రియుడు నాగూర్​తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూనే ఉంది.

భార్య వ్యవహారంపై కొద్దికాలంగా భర్త శ్రీనివాస్​కు అనుమానం వచ్చింది. తాజాగా వీరిద్దరూ తాళ్లపాలెంలో నాగూర్ బంధువులకు చెందిన ఇంట్లో ఉండగా... భర్త శ్రీనివాస్ కొంతమంది యువకులతో కలిసి వెళ్లి భార్య, ఆమె ప్రియుడు నాగూర్​పై దాడి చేశారు. వారిద్దర్నీ అక్కడి నుంచి తీసుకెళ్లి శెట్టిపేటలోని శ్రీనివాస్ బంధువుకు చెందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్​లో నిర్బంధించారు. ఆ గదిలో దొరికిన ఎలుకల మందును వీరు ఇరువురు తిని చనిపోయినట్లు సమాచారం. నాగసాయి కుమారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నట్లు నిడదవోలు సీఐ కే.ఎ. స్వామి తెలిపారు.

ఇవీ చదవండి: మూడు పూరిళ్లు దగ్ధం.. విద్యుత్ తీగలే కారణం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.