ETV Bharat / crime

అర్ధరాత్రి అగ్ని ప్రమాదం.. మూడు బస్సులు దగ్ధం

author img

By

Published : Feb 13, 2023, 12:09 PM IST

fire accident in private buses at Kukatpally
కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం వలన మూడు బస్సులు దగ్ధం

Bus fire accident in Hyderabad: అర్ధరాత్రి హైదరాబాద్​ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వలన మూడు ప్రైవేట్ బస్సులు కాలిపోయాయి. మరో నాలుగు బస్సులను స్థానికుల సహాయంతో మంటల్లో కాలిపోకుండా చేశారు.

Bus fire accident in Hyderabad: పార్కింగ్‌లో ఉన్న బస్సుల్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు రావడంతో సమీపంలో ఉన్న స్థానికులు వచ్చి మంటలను ఆపేందుకు ప్రయత్నించారు. అయిన మూడు బస్సులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన హైదరాబాద్ జిల్లాలోని కూకట్​పల్లిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్​లోని కూకట్‌పల్లి ఐడీఎల్‌ చెరువు సమీపంలో అర్ధరాత్రి పార్కింగ్ చేసి ఉన్న బస్సుల్లో విద్యుత్​ఘాతం వలన ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి మంటలను అర్పేందుకు ప్రయత్నించారు. స్థానికులు ఎంత ప్రయత్నించిన కొంత సమయం వరకు మంటలు అదుపులోకి రాలేదు.

అప్పటికి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినందున మూడు బస్సులు దగ్ధమయ్యాయి. మరో నాలుగు బస్సులను అక్కడి నుంచి వేరే చోటికి స్థానికులు తరలించారు. ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న బస్సులు భారతి ట్రావెల్స్​కు చెందినవిగా భావిస్తున్నారు. జరిగిన ప్రమాదం విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వారు స్పందించి దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం విద్యుత్​ఘాతం వలన జరిగిందా లేదా సహజంగానే జరిగిందా లేదా ఇతర ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం వలన మూడు బస్సులు దగ్ధం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.