ETV Bharat / crime

Suicide: తండ్రి మందలించాడని... రైలు కింద పడిన కుమారుడు

author img

By

Published : Oct 28, 2021, 1:49 PM IST

Suicide
Suicide

తండ్రి మందలించాడన్న నెపంతో ఓ విద్యార్థి.. ఆత్మహత్య(student commits suicide by falling train at Tadipatri) చేసుకున్న ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఎందుకు రాత్రి సమయాల్లో ఆలస్యంగా ఇంటికి వస్తున్నావని తండ్రి అడుగడంతో రైలు కింద పడి మరణించాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తండ్రి మందలించడంతో ఓ విద్యార్థి.. రైలు కింద పడి ఆత్మహత్య(student commits suicide by falling train at Tadipatri) చేసుకున్న ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకుంది. విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన హమాలీ కుమారుడు నవీన్‌(21).. పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం(naveen commits suicide at Tadipatri) చదువుతున్నాడు. అయితే, నవీన్‌ రాత్రి సమయాల్లో ఆలస్యంగా ఇంటికి వెళ్తుండేవాడు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో నవీన్‌కు తండ్రి ఫోన్‌ చేసి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్‌.. రాత్రి ఇంటికి వెళ్లకుండా బయటే ఉన్నాడు. గురువారం ఉదయం తాడిపత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సమీపంలోని రైలు పట్టాలపై నవీన్​ మృతదేహం (naveen commits suicide at Tadipatri) ఉన్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపిన పోలీసులు.. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Murder Attempt on Young Woman: అర్ధరాత్రి ఇంటికొచ్చి డిగ్రీ విద్యార్థినిపై హత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.