ETV Bharat / crime

తోడబుట్టిన సోదరిపై సోదరుడు కత్తులతో దాడి.. కారణం అదేనా?

author img

By

Published : Apr 9, 2022, 4:11 PM IST

ATTACKED  WITH KNIFES
సోదరి ఆమె భర్తపై కత్తులతో దాడి

Brother Attack on Sister with Knife: తమకు తెలియకుండా భూమి అమ్మిందనే కారణంతో తోడబుట్టిన సోదరులే.. సోదరి, ఆమె భర్తపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Brother Attack on Sister with Knife: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామంలో ఓ భూవివాదంలో తోడబుట్టిన చెల్లి, ఆమె భర్తపై సోదరులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. సంధ్యకు 20 సంవత్సరాల క్రితం రావుల రమేష్​ అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. సంధ్య తల్లిదండ్రులు ఒక ఎకరం భూమిని ఆమె పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించారు. అవసరాల నిమిత్తం సంధ్య తన భూమిని వేరే వాళ్లకు అమ్మేసింది.

ఈవిషయం తెలుసుకున్న సోదరులు బోల గాని శ్రీనివాస్, సురేందర్​లు సంధ్యతో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా కత్తులతో విచక్షణారహితంగా ఇద్దరిపై చేశారు. ఈ ఘటనలో ఇద్దరకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: లేలేత ప్రాయంలో మత్తుకు బానిసై.. వైట్​నర్​ సేవిస్తున్న చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.