ETV Bharat / crime

లేడీస్​ ఎంపోరియంలో అగ్ని ప్రమాదం.. రూ.40లక్షల ఆస్తినష్టం..!

author img

By

Published : Feb 11, 2022, 10:23 AM IST

Fire Accident
Fire Accident

Fire Accident In Godavari Khani : గోదావరిఖని వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్​లోని పల్లవి లేడీస్ ఎంపోరియంలో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. విద్యుత్​ షాట్​ సర్క్యూట్​ కావడం వల్ల మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు.

లేడీస్​ ఎంపోరియంలో అగ్ని ప్రమాదం.. రూ.40లక్షల ఆస్తినష్టం..!

Fire Accident In Godavari Khani : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లక్ష్మీనగర్​లోని వ్యాపార కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక పల్లవి లేడీస్​ ఎంపోరియంలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

అప్పటికే దుకాణంలో రూ.40లక్షల సామగ్రి కాలిబూడిదైనట్లు షాపు యజమాని పేర్కొన్నారు. ప్రమాదానికి షార్ట్​ సర్క్యూట్​ కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలిని విద్యుత్​ శాఖ అధికారులు, పోలీసులు పరిశీలించారు. తెల్లవారుజామున ఒక్కసారిగా మండలు ఎగిసిపడడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

ఇదీ చూడండి : BIKE ACCIDENT: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ.. నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.