ETV Bharat / crime

వాకలపూడి ప్యారీ షుగర్స్‌లో మళ్లీ ప్రమాదం, ఇద్దరు మృతి

author img

By

Published : Aug 29, 2022, 6:52 PM IST

boiler blast in industry
boiler blast in industry

BLAST AT SUGAR INDUSTRY ఏపీలోని కాకినాడ వాకలపూడిలోని ప్యారీ షుగర్స్‌లో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతగా మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

BLAST AT SUGAR INDUSTRY: ఆంధ్రప్రదేశ్ కాకినాడ వాకలపూడిలోని ప్యారీ షుగర్స్‌లో మరోసారి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడగా.. ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 19న ఇదే పరిశ్రమలో ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల్లోనే పరిశ్రమలో మళ్లీ ప్రమాదం జరగడంతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. బాయిలర్‌ పేలడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

ఈ ఘటనలో మృతులు, క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వాకలపాడి పారిశ్రామికవాడ ప్రాంతంలో ఉన్న ప్యారీ షుగర్స్‌ రిఫైనరీ పరిశ్రమలో పంచదారను శుద్ధి చేసి ఎగుమతి చేస్తుంటారు. అయితే, తాజాగా జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి అసలేం జరిగింది? ఎందుకు జరిగింది? అనే విషయాలపై ఎలాంటి సమాచారం లేదు. ఆస్పత్రి వద్దకు సిబ్బంది వచ్చినవాళ్లు నోరు మెదపడంలేదని తెలుస్తోంది. ఈ నెల 19న ప్రమాదం జరిగిన సందర్భంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకోవడం.. మళ్లీ ఇలాంటి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించినా మళ్లీ అక్కడ ప్రమాదం జరగడం గమనార్హం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.