ETV Bharat / crime

ఆటోని ఢీకొట్టిన బస్సు.. దంపతుల మృతి, 11 మందికి గాయాలు

author img

By

Published : Dec 12, 2022, 9:19 AM IST

bus collied
bus collied

అప్పటివరకు వారంతా సంతోషంతో ఉన్నారు. పుట్టిన రోజు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం అంతా కలిసి రాత్రి 10 గంటల సమయంలో ఆటోలో ఇంటికి బయలుదేరారు. కానీ రోడ్డుపై చిన్న గుంత వారి ఆనందాలను ఆవిరి చేసింది. ఎదురుగా ఉన్న గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టారు. దీంతో ఆటోలో ఉన్న భార్యభర్త చనిపోగా 11 మంది గాయపడ్డారు.

పుట్టినరోజు వేడుకలు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆటోను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడిన ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 11మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన కాన్వాయిలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వెంకటరామపురం నుంచి ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం జిల్లేపల్లికి ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ముందు గుంతను తప్పించే క్రమంలో ఆటో కోదాడ వైపు వెళ్తున్న అయ్యప్ప మాలదారుల బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలైన దువ్వా రమేష్(30), దువ్వా రేణుక(25) మృతి చెందారు. కేసు నమోదు చేసిన కోదాడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.