ETV Bharat / crime

Attack on couple : భూవివాదంలో దంపతులపై దాడి.. కారు ధ్వంసం

author img

By

Published : Jan 24, 2022, 2:22 PM IST

Updated : Jan 24, 2022, 7:20 PM IST

Attack on couple,  govindapalli land dispute
భూవివాదంలో దంపతులపై దాడి

Attack on couple : భూవివాదం కారణంగా దంపతులపై వారి బంధువులు దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. ఈ మేరకు గొల్లపల్లి పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

Attack on couple : జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. భూవివాదం కారణంగా దంపతులు ప్రయాణిస్తున్న కారుపై వారి బంధువులు దాడి చేశారు. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. గొల్లపల్లి మండలం గోవిందుపల్లెలో స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఘటనా సమయంలో కారులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. బంధువులు వచ్చి ఒక్కసారిగా దాడి చేయడంతో... ఆ దంపతులు భయాందోళనలకు గురయ్యారు.

అయితే గత కొంతకాలంగా భూ పంపకాల విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

భూవివాదంలో దంపతులపై దాడి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: Husband killed wife at Teegalapahad : భార్యను హతమార్చిన భర్త.. ఆపై పోలీసుల ఎదుట..

Last Updated :Jan 24, 2022, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.