ETV Bharat / city

'ప్రైవేటీకరణతో సామాన్య ప్రజలకే అన్యాయం'

author img

By

Published : Feb 19, 2021, 1:47 PM IST

united bank unions protest against privatization of banks and insurance companies in Hyderabad
'ప్రైవేటీకరణతో సామాన్య ప్రజలకే అన్యాయం'

ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆందోళన బాట పట్టింది. బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ధర్నా నిర్వహించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 1 నుంచి 15 వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేయనున్నట్లు బ్యాంక్ యూనియన్ కన్వీనర్ శ్రీరామ్ పేర్కొన్నారు.

బ్యాంకులు, బీమా కంపెనీల ప్రైవేటీకరణతో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ కన్వీనర్ శ్రీరామ్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ప్రైవేటీకరణను నిరసిస్తూ.. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో పలు బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ధర్నా నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వివిధ రూపాల్లో..

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 1 నుంచి 15 వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు శ్రీరామ్ వివరించారు. 15, 16 తేదీల్లో సమ్మె చేయనున్నట్లు స్పష్టం చేశారు. కొన్ని బ్యాంకుల ప్రైవేటీకరణ.. ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రైవేటు భాగస్వామ్యం ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్​లో ప్రకటించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగులకు నష్టం లేదు

ప్రైవేటీకరణతో బ్యాంకు ఉద్యోగులకు ఎలాంటి నష్టం లేదని.. సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయి ప్రసాద్ వివరించారు. అందరి కోసం ఈ పోరాటం కొనసాగుతుందని.. ప్రజలందరూ సమైక్యంగా ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఆకాంక్షించారు.

'ప్రైవేటీకరణతో సామాన్య ప్రజలకే అన్యాయం'

ఇదీ చూడండి: ఇలాంటి చోట పని చేస్తుంటే ఆ ఉద్యోగం మారితేనే మంచిది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.