ETV Bharat / city

'నాలుగేళ్ల విధుల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?'

author img

By

Published : Jun 27, 2022, 3:17 PM IST

నాలుగేళ్ల విధుల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?
నాలుగేళ్ల విధుల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?

Revanth Reddy on Agnipath: త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన 'అగ్నిపథ్‌'ను ఉపసంహరించే వరకు పోరాటం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంతో యువత భవితను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. సైనికులకు 6 నెలల శిక్షణ ఏం సరిపోతుందని ప్రశ్నించిన ఆయన.. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరులు బడా పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా'? అని ప్రశ్నించారు.

Revanth Reddy on Agnipath: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ ఉపసంహరణకు పోరాటం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. సైనికులకు 6 నెలల శిక్షణ ఏం సరిపోతుందని ప్రశ్నించారు. అగ్నిపథ్‌ తీసుకొచ్చి యువత భవితను నాశనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని మల్కాజిగిరి కూడలిలో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో రేవంత్‌ పాల్గొని మాట్లాడారు.

'ఈడీ దాడులకు కాంగ్రెస్‌ భయపడదు..మోదీ ప్రభుత్వంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఈడీతో దాడులు చేయించినా కాంగ్రెస్‌ భయపడదు. రైతులు, సైనికులను సమాజాన్ని నిర్మించే శక్తులుగా కాంగ్రెస్‌ గుర్తించింది. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే జవాన్​లను అవమానించేలా మోదీ సర్కారు వ్యవహరిస్తోంది. నాలుగేళ్లు సైన్యంలో పని చేసి ఆ తర్వాత బడా పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా'?: రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

పార్టీలకు అతీతంగా కాపాడుకోవాలి.. అగ్నిపథ్‌తో ఉద్యోగ భద్రత లేదు. మాజీ సైనికుల హోదా లేదు. పింఛన్‌ రాదు. సికింద్రాబాద్ అల్లర్ల సందర్భంగా తెలంగాణ యువకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను దిల్లీలో ఉన్న కేటీఆర్‌ కోరాలి. పార్టీలకు అతీతంగా యువకులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటే కాంగ్రెస్‌ తెచ్చిన స్వాతంత్య్రాన్ని పణంగా పెట్టడమా? కోటి జనాభా లేని ఇజ్రాయెల్‌తో 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌ను పోలుస్తారా?: రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఈ విషయంలో కేసీఆర్‌ తన వైఖరి తెలపాలని రేవంత్ డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌ నుంచి రిటైరయ్యాక యువకులకు ఏ ఉద్యోగాలు వస్తాయి? ఉద్యోగాలు లేక పక్కదారి పట్టి తీవ్రవాదంలో చేరితే ఎవరిది బాధ్యత అని ఆయన ప్రశ్నించారు. నిరసనకారులకు తెరాస సర్కార్‌ ఎందుకు న్యాయసాయం చేయడం లేదో చెప్పాలన్నారు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు అగ్నిపథ్‌పై తన వైఖరిని కేసీఆర్‌ స్పష్టం చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

'నాలుగేళ్ల విధుల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?'

ఇవీ చూడండి..

'మా అందరి గమ్యం అగ్నిపథ్​'.. ఆ గ్రామ యువత ప్రతిజ్ఞ!

Musi Project Gates Lifted : మూసీ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.