ETV Bharat / city

Tollywood Celebrities Meet AP CM Jagan: సీఎం జగన్​తో ముగిసిన సినీ ప్రముఖుల భేటీ

author img

By

Published : Feb 10, 2022, 11:39 AM IST

Updated : Feb 10, 2022, 1:32 PM IST

Tollywood
Tollywood

Tollywood Celebrities Meet AP CM Jagan: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో ఈ సమావేశం జరిగింది. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై జరిగిన ఈ చర్చలో చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ తదితరులు పాల్గొన్నారు.

సీఎం జగన్​తో చర్చలో పాల్గొన్న సినిమా హీరోలు, దర్శకులు వీళ్లే...

Tollywood Celebrities Meet AP CM Jagan: ఆంధ్రప్రదేశ్​లో టికెట్​ రేట్లపై ఏపీ సీఎం జగన్​తో టాలీవుడ్​ ప్రముఖుల భేటీ ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, నారాయణమూర్తి ఈ భేటీలో పాల్గొన్నారు. మొదటగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వీరు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడ సీఎం జగన్‌తో సమావేశమయ్యారు.

జగన్​ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రి పేర్ని నానితో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిర్మాతలు నష్టపోకుండా టికెట్ల ధరలు పెంచాలని పరిశ్రమ ప్రముఖులు కోరారు. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ కూడా... టికెట్ ధరలు పెంచాలని ప్రాథమికంగా సిఫార్సు చేసినట్లు తెలిసింది. పరిశ్రమ ప్రతిపాదనలు, కమిటీ సిఫార్సులపై సినీ ప్రముఖులతో సీఎం జగన్​ చర్చించారు. ఎంతమేర టికెట్లు పెంచాలనే దానిపై అభిప్రాయాలు తీసుకుంటారని తెలిసింది.

Tollywood
టాలీవుడ్ ప్రముఖులు

వివిధ అంశాలపై...

రాయితీ సహా సినీ కార్మికులకు సాయంపైనా..చిత్ర పరిశ్రమకు ప్రభుత్వ సాయంపైనా సీఎంతో సినీ ప్రముఖులు చర్చించారని సమాచారం. కొవిడ్‌ తొలిదశలో లాక్​డౌన్ కారణంగా 3నెలల పాటు థియేటర్లు మూతపడ్డాయి. ఆ తర్వాత తెరచుకున్నా 50 శాతం సీటింగ్ సహా వివిధ రకాల ఆంక్షలతో రాబడి అంతంతమాత్రమేనని యజమానులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో థియేటర్ల యజమానులకు కరెంట్ బిల్లుల రాయితీ సహా సినీ కార్మికులకు సాయంపైనా కూడా చర్చించారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు అవార్డులు ఇవ్వడం, ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ పరిశ్రమ ప్రముఖులతో సమావేశం ఉండటం, అలాగే టికెట్ రేట్ల పిటిషన్‌ హైకోర్టులో విచారణకు వస్తున్నందున.. బుధవారం సీఎంతో మంత్రి పేర్ని నాని సమావేశమై చర్చించారు.

ఏపీ సీఎంతో భేటీ తర్వాత అన్ని వివరాలు చెబుతా. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వివరాలు మీడియాకు ఇస్తారు. కచ్చితంగా ఇవాళ సినీ సమస్యలకు శుభం కార్డు పడుతుంది. సీఎం నుంచి ఆహ్వానం మేరకే వెళ్తున్నా. సమావేశానికి ఎవరిని పిలిచారో అక్కడికి వెళ్లాక తెలుస్తుంది.

-- చిరంజీవి, సినీనటుడు

తమ్మారెడ్డి రియాక్షన్...

కొందరితోమే చర్చలు సరికాదు...సినీ పరిశ్రమ సమస్యలపై కేవలం కొందరితో చర్చించడం సరికాదని... దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ భేటీతో సినిమా టికెట్ల సమస్య కొలిక్కి వస్తుందని భావిస్తున్నానని నిర్మాత అల్లు అరవింద్​ అన్నారు.

సినిమా టికెట్ల సమస్య కొలిక్కి వస్తుందని భావిస్తున్నా. ఇరుపక్షాలకు మంచి జరుగుతుందని భావిస్తున్నాం. ఇప్పటికే చిరంజీవి వెళ్తున్నారు. ఒక ఇంటి నుంచి ఇద్దరు ఎందుకు?

-అల్లు అరవింద్‌

ఏపీలో సినిమా టికెట్‌ ధరల వ్యవహారం హాట్‌టాపిక్‌..

ఇటీవల ఏపీలో సినిమా టికెట్‌ ధరల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌ అయింది. ధరలు తక్కువగా ఉండటంతో నష్టపోతున్నామని పలువురు సినిమా హీరోలు, నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ధరల విషయంపై కమిటీ అధ్యయనం పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో టికెట్‌ ధరలను ఏ మేరకు పెంచాలన్న దానిపైనా, ఇటు ప్రజలకు, అటు సినీ పరిశ్రమకు ఇబ్బంది లేకుండా టికెట్‌ రేట్లు ఎంత ఉండాలన్న దానిపైనా కమిటీ సభ్యులు నివేదికను రూపొందించారు. ఈ నివేదికలోని అంశాలను మంత్రి పేర్ని నాని, సీఎం జగన్‌కు వివరించారు. అంతేకాదు, థియేటర్‌లలో మౌలిక సదుపాయాలు, క్యాంటీన్‌లో ఆహార పదార్ధాల ధరలపైనా కమిటీ చేసిన అధ్యయనాన్ని మంత్రి పేర్ని నాని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఇదీ చదవండి: Modi Enemy Of Telangana: ట్రెండింగ్​లో 'మోదీ ఎనిమీ ఆఫ్‌ తెలంగాణ'

Last Updated :Feb 10, 2022, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.