ETV Bharat / city

Telangana Loan: మరో రెండు వేల కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ సర్కారు

author img

By

Published : Feb 5, 2022, 8:27 AM IST

Telangana Loan: రాష్ట్ర అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనుంది. రిజర్వ్​బ్యాంకు ఎనిమిదో తేదీన వేయనున్న బాండ్ల వేలంలో మరో రెండు వేల కోట్లను రుణంగా సమీకరించుకోనుంది.

TELANGANA GOVERNMENT TO BORROW ANOTHER RS 2000 CRORE FROM RESERVE BANK BANDS
TELANGANA GOVERNMENT TO BORROW ANOTHER RS 2000 CRORE FROM RESERVE BANK BANDS

Telangana Loan: రాష్ట్ర ప్రభుత్వం మరో 2000 కోట్ల రూపాయలు రుణంగా తీసుకోనుంది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించుకోనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 14 ఏళ్ల కాలపరిమితితో జారీ చేసిన బాండ్లను రిజర్వ్ బ్యాంకు ద్వారా ఈ నెల ఎనిమిదో తేదీన వేలం వేస్తారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 41వేల కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమీకరించుకుంది. తాజాగా నోటిఫికేషన్​తో రుణాల మొత్తం 43 వేల కోట్ల రూపాయలను దాటనుంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.