ETV Bharat / city

మూడో దశ వ్యాక్సినేషన్​​కు సిద్ధమవుతున్న ప్రభుత్వం

author img

By

Published : May 23, 2021, 5:27 AM IST

vaccination
మూడో దశ వ్యాక్సినేషన్​​కు సిద్ధమవుతున్న ప్రభుత్వం

రాష్ట్రంలో మూడో దశ కొవిడ్​ వ్యాక్సినేషన్​కు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వైరస్​ వ్యాప్తికి అవకాశం ఉన్న సూపర్​ స్రైడర్లను గుర్తించి.. వీరికి ప్రాధాన్యత క్రమంలో టీకాలు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి ఇప్పటికే తెలిపారు. జూన్ నెలలో ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సినేషన్‌ చేయాలని..జులైలో మమ్మరంగా టీకాలు వేయాలన ప్రభుత్వం భావిస్తోంది.

కొవిడ్ మూడో దశ వ్యాక్సినేషన్​కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డ్రైవర్లు, కండక్టర్లు, కూరగాయల వ్యాపారులు, వీధి వ్యాపారులు, దుకాణాల్లో పనిచేసే వారు... ఇలా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న వారిని గుర్తించి మొదటగా టీకాలు ఇవ్వాలని భావిస్తోంది. వీరికి టీకాల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ దిశగా సూపర్ స్ప్రెడర్ల జాబితా సిద్ధం చేయాలని ఇప్పటికే జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆ వివరాలు అందిన వెంటనే త్వరలోనే ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలు

ఇందుకోసం ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కొవాగ్జిన్ వేసుకున్న వారికి రెండో డోసును త్వరలోనే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే టీకాల డోసులను బట్టి 45 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు.

18 నుంచి 44 ఏళ్ల వారి కోసం..

18 నుంచి 44 ఏళ్ల వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల టీకాల డోసులను కొనుగోలు చేసింది. జూన్ నెల కోటాలో మరికొన్ని డోసులు సమకూరుతాయని చెప్తున్నారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్‌కు తోడు స్పుత్నిక్-వి కూడా కొంత అందుబాటులోకి వస్తుందని అంటున్నారు.

జూన్ నెలలో ప్రాధాన్యతా క్రమంలో చేపట్టి... జూలైలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పటి వరకు ఇతర టీకాలు అందుబాటులోకి వస్తాయని, గ్లోబల్ టెండర్ల ద్వారా కూడా టీకాలు సమకూరుతాయని భావిస్తున్నారు.

ఇవీచూడండి: ఆరోగ్య సిబ్బందిలో 66% మందికే టీకా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.