ETV Bharat / city

ఇయర్ రిపోర్ట్: నేరాలు తగ్గాయ్.. శిక్షలు పెరిగాయ్: మహేశ్ భగవత్

author img

By

Published : Dec 28, 2020, 12:42 PM IST

rachakonda police commissioner mahesh bhagavath release yearly crime report
ఇయర్ రిపోర్ట్: నేరాలు తగ్గాయ్.. శిక్షలు పెరిగాయ్: మహేశ్ భగవత్

రాచకొండ కమిషనరేట్​ పరిధిలోని నేరాల వార్షిక నివేదికను... సీపీ మహేశ్ భగవత్​ విడుదల చేశారు. గతేడాది కంటే 12 శాతం నేరాలు తగ్గినట్టు తెలిపారు. 51 శాతం మంది నిందితులకు శిక్షలు పడగా.. 82 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్టు వెల్లడించారు.

రాచకొండ కమిషనరేట్​ పరిధిలో గత ఏడాది కంటే 12 శాతం నేరాలు తగ్గినట్టు... కమిషనర్ మహేశ్ భగవత్​ తెలిపారు. కమిషనరేట్​ పరిధిలోని వార్షిక నేర నివేదిక ఇవాళ విడుదల చేశారు. సీసీఎస్​లో 229 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా... రూ.3.86 కోట్లు రికవరీ చేసినట్టు తెలిపారు. ఎస్​వోటి విభాగంలో 892 కేసులు నమోదు కాగా... రూ.5.95 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. నమోదైన కేసుల్లో 51 శాతం నిందితులకు శిక్షలు పడగా... 5,548 కేసులుల లోక్​ అదాలత్​లో పరిష్కరించినట్టు వెల్లడించారు. నలుగురు చెడ్డీ గ్యాంగ్ నిందితులకు మూడేళ్ల జైలుశిక్ష విధించి, 82 మందిపై పీడీ యాక్ట్​ ప్రయోగించినట్టు వివరించారు.

రాచకొండ పరిధిలో 704 సైబర్​ క్రైమ్​ కేసులు నమోదైనట్టు సీపీ తెలిపారు. కమిషనరేట్​ పరిధిలో 12 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి... 136 కేసులను వాటి సాయంతోనే పరిష్కరించినట్టు చెప్పారు. సామాజిక మాధ్యమాల 4,926 ఫిర్యాదులు, డయల్​ 100కి 1.66 లక్షల కాల్స్​ వచ్చినట్టు వివరించారు. 2,525 మంది తప్పిపోగా... 2,233 మందిని గుర్తించినట్టు పేర్కొన్నారు. షీ టీమ్​ల ఆధ్వర్యంలో 23 బాల్యవివాహాలను అడ్డుకున్నట్టు వివరించారు.

ఇదీ చూడండి: వైభవంగా సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.