ETV Bharat / city

Telangana Governor Tamilisai : 'ఎన్‌ఎస్‌జీ కమెండోలు ధైర్యానికి ప్రతీక'

author img

By

Published : Oct 17, 2021, 12:23 PM IST

Black Cat Rally in Hyderabad
Black Cat Rally in Hyderabad

ఎన్​ఎస్​జీ(National Security Guard) వంటి వాటి వల్ల దేశప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఎంతో మందికి ఎన్​ఎస్​జీ ప్రేరణ అని.. యువత ఎన్​ఎస్​జీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తోందని తెలిపారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​లో భాగంగా ఈనెల 2న ప్రారంభమైన సుదర్శన్ భారత్ పరిక్రమ యాత్ర హైదరాబాద్​ చేరుకుంది. ఇందులో భాగంగా ఇవాళ నెక్లెస్​రోడ్డులో నిర్వహించిన ఆలిండియా బ్లాక్ క్యాట్ ర్యాలీని(Black cat Rally) గవర్నర్ తమిళిసై(Telangana Governor Tamilisai) ప్రారంభించారు.

హైదరాబాద్​లో బ్లాక్ క్యాట్ ర్యాలీ

మార్షల్ ఆర్ట్స్​ను విద్యలో భాగం చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Telangana Governor Tamilisai) అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే డిఫెన్స్ నేర్పించాలన్నారు. ధైర్యానికి ప్రతీక అయిన ఎన్​ఎస్​జీ(National Security Guard) వంటి సంస్థల్లో యువత చేరాలని సూచించారు. ఎన్​ఎస్​జీ(National Security Guard) వల్ల దేశంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పారు.

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్(Azadi Ka Amrut Mahotsav)'​లో భాగంగా ఈనెల 2న ప్రారంభమైన 'సుదర్శన్ భారత్ పరిక్రమ(Sudarshan Bharat Parikrama)' యాత్ర హైదరాబాద్​ చేరుకుంది. నగరంలోని నెక్లెస్​రోడ్​లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్ క్యాట్ ర్యాలీని రాష్ట్ర గవర్నర్ తమిళిసై(Telangana Governor Tamilisai) ప్రారంభించారు. ఈ ర్యాలీ దేశంలోని 18 నగరాల మీదుగా 7,500 కిలోమీటర్లు ప్రయాణించి అక్టోబర్ 30న దిల్లీ చేరుకోనుంది. దిల్లీలోని జాతీయ పోలీస్ స్మారక చిహ్నం వద్ద ముగియనుంది.

బ్లాక్ క్యాట్ ర్యాలీని ప్రారంభించిన గవర్నర్(Telangana Governor Tamilisai).. దేశభద్రతలో ఎన్​ఎస్​జీ(National Security Guard) పాత్ర గురించి మాట్లాడారు. ఈ ర్యాలీ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఎన్నో గొప్ప ఆపరేషన్లను ఎన్​ఎస్​జీ విజయవంతంగా నిర్వహించిందని ఉద్ఘాటించారు. ఎన్​ఎస్​జీ(National Security Guard) వంటి వాటి వల్ల దేశప్రజలు భద్రతాభావంతో ఉంటున్నారని చెప్పారు. ఎంతో మంది యువకులు.. ఎన్​ఎస్​జీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని తమిళిసై (Telangana Governor Tamilisai) పేర్కొన్నారు.

"ఎన్​ఎస్​జీ బ్లాక్ క్యాట్ ర్యాలీని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ర్యాలీ దేశభక్తిని, ఐక్యతను చాటిచెబుతోంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్​ నుంచి ఈ ర్యాలీ హైదరాబాద్​కు చేరుకుంది. ఇక్కణ్నుంచి తర్వాత చెన్నైకి వెళ్తోంది. ఎన్​ఎస్​జీ ఎన్నో గొప్ప ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసింది. దేశభద్రతలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశాన్ని ఎన్​ఎస్​జీ కమెండోలు ఎలా రక్షిస్తున్నారో.. అలాగే పిల్లలు తమను తాము రక్షించుకోవడానికి ప్రతి పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్​ని భాగం చేయాలి."

- తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.