ETV Bharat / city

Harish Rao in Assembly 2021: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు త్వరలోనే శ్రీకారం

author img

By

Published : Oct 1, 2021, 10:55 AM IST

Updated : Oct 1, 2021, 12:39 PM IST

Harish Rao in Assembly 2021
Harish Rao in Assembly 2021

మూడురోజుల విరామం అనంతరం శాసనసభ సమావేశాలు(assembly sessions news) ప్రారంభం కాగా... ఒకటి రెండు మాసాల్లోనే.. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు.. టెండర్లు పూర్తి చేసి... పనులు ప్రారంభిస్తామని మంత్రి హరీశ్​రావు (minister Harish Rao) ఈ సభలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు.

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో తాగునీరు సమస్య పరిష్కారం అయిందని మంత్రి హరీశ్​రావు (Minister Harish Rao) అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. మూడ్రోజుల విరామం అనంతరం శాసనసభ సభ సమావేశాలు (assembly sessions 2021) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో శాసనసభ్యులు క్రాంతి కిరణ్​, మహారెడ్డి భూపాల్​రెడ్డి, మాణిక్​రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్​రావు సమాధానమిచ్చారు. త్వరలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు.

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలపై హరీశ్​రావు సమాధానం

ఒకటి రెండు మాసాల్లోనే.. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు.. టెండర్లు పూర్తి చేసి... పనులు ప్రారంభిస్తాం. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అత్యధిక సాగునీరు అందుకోనున్న నియోజకవర్గంగా నారాయణఖేడ్‌ నిలుస్తుంది. అతి త్వరలోనే ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.

- హరీశ్ రావు, మంత్రి

4.97 శాతానికి పెరిగింది

తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయా ఉత్పత్తి వాటా అత్యధికంగా పెరిగిన విషయం వాస్తవమేనా అని అసెంబ్లీలో గాదరి కిషోర్​ కుమార్​ అడిగారు. ఆ పూర్తి వివరాలు తెలిపాలని కోరారు. దీనికి మంత్రి హరీశ్​రావు సమాధానమిచ్చారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు జీఎస్‌డీపీ 4.06 శాతంగా ఉండేదని వెల్లడించారు. దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.97 శాతానికి పెరిగిందని స్పష్టం చేశారు. దేశ జీడీపీలో రాష్ట్ర వాటా పెరిగిందన్నారు.

దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో జీఎస్​డీపీ వాటాపై హరీశ్​రావు సమాధానం

15వ ఆర్థిక సంఘం ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని సూచించినా... కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు. ప్రతి ఏడాదీ దేశ జీడీపీలో జీఎస్​డీపీ వాటా పెంచుకుంటూ వెళ్తున్నామన్న మంత్రి... ఏడేళ్లలో ప్రాథమిక రంగానికి రెండున్న లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.

- హరీశ్​రావు, మంత్రి

అత్యధిక వృద్ధి రేటు నమోదు

దేశంలోనే తెలంగాణ అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రాథమిక రంగంలో రాష్ట్రం పురోగతి సాధించినట్లు నీతిఆయోగ్ చెప్పిందని గుర్తు చేశారు. సాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని ఉద్ఘాటించారు. రైతుబంధు, రైతుబీమా, రైతులకు రుణమాఫీ అమలు చేస్తున్నామని వివరించారు.

ఇదీ చూడండి: LIVE: శాసనసభ వర్షాకాల సమావేశాలు

Last Updated :Oct 1, 2021, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.