ETV Bharat / city

పాతబస్తీలో ప్రశాంతంగా కొవిడ్ వ్యాక్సినేషన్

author img

By

Published : May 27, 2021, 4:29 PM IST

covid vaccination, corona vaccination, covid vaccination at old city
కరోనా వ్యాక్సినేషన్, పాతబస్తీలో కొవిడ్ వ్యాక్సినేషన్

రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడ పీహెచ్​సీలో మధ్యాహ్నం వరకు 47 మంది రెండో డోస్ టీకా తీసుకున్నారు. రెండ్రోజుల నుంచి ఇప్పటివరకు 222 మంది రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు.

రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్ పాతబస్తీలో రెండ్రోజుల నుంచి దాదాపు 222 మంది రెండో డోస్ టీకా తీసుకున్నారు. గురువారం రోజున మధ్యాహ్నం వరకు 47 మంది రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.

బండ్లగూడ పీహెచ్​సీ పక్కనే ఏర్పాటు చేసిన కరోనా పరీక్షా కేంద్రంలో ఇవాళ 84 మంది అనుమానితులు టెస్ట్ చేయించుకోగా.. నలుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారికి కిట్ అందజేసి వారి వివరాలు సేకరిస్తున్నారు. వారి చుట్టు పక్కల సర్వే చేయిస్తున్నారు. వ్యాక్సినేషన్​తో పాటు రోజువారి చికిత్స కోసం వెళ్తున్న రోగులను పరీక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి వస్తున్న రోగులు కొవిడ్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, కరోనా నిబంధనలు పాటించి వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.