ప్రజలంతా కరోనా మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని గ్రేటర్ కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించారు. ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు.
టీకా తీసుకోవడానికి వచ్చే వారితో మాట్లాడారు. వ్యాక్సినేషన్ కేంద్రంలో ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.