ETV Bharat / city

Jagan assets case: జగన్‌ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సమయం కోరిన సీబీఐ

author img

By

Published : Aug 13, 2021, 5:42 PM IST

cm-jagan-illegal-property-case-hearing-at-cbi-and-ed-court-at-hyderabad
cm-jagan-illegal-property-case-hearing-at-cbi-and-ed-court-at-hyderabad

ఏపీ ముఖ్యమంత్రి జగన్​ అక్రమాస్తుల కేసుపై హైదరాబాద్​ సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు చేసేందుకు సీబీఐ మరోసారి గడువు కోరింది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్​ అక్రమాస్తుల కేసుపై హైదరాబాద్​లోని సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. పెన్నా సిమెంట్స్ కేసులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు చేసేందుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. ఇండియా సిమెంట్స్ కేసులోనూ డిశ్చార్జ్ పిటిషన్ వేస్తామని జగన్, విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ప్రస్తుత తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. ఈ కారణంగా.. ఇండియా సిమెంట్స్ కేసు విచారణ ఈనెల 23కు వాయిదా వేసిన న్యాయస్థానం.. పెన్నా, రఘురాం సిమెంట్స్ కేసుల విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

'నేనే చంపాను.. మళ్లీ బతికిస్తాను'.. జగిత్యాలలో శవం వద్ద పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.