ETV Bharat / city

అవును... ప్రధాని మోదీ సేల్స్‌మెనే..: బండి సంజయ్‌

author img

By

Published : Jul 3, 2022, 12:14 PM IST

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay Fire on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భాజపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ ప్రధానిని సేల్స్​మెన్ అంటావా అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని.. కేసీఆర్‌ అవమానపరిచారని.. ప్రజలు క్షమించరని ఆయన ధ్వజమెత్తారు.

Bandi Sanjay Fire on CM KCR: సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై భాజపా నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని.. కేసీఆర్‌ అవమానపరిచారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. దేశ ప్రజలు కేసీఆర్​ను క్షమించరని ఆయన ధ్వజమెత్తారు.

'ప్రధాని మోదీని... కేసీఆర్‌ అవమానపరిచారు. దేశ ప్రజలు కేసీఆర్‌ను క్షమించరు. ప్రధాని మోదీ సేల్స్‌మెనే. ప్రజలను ఆదుకోవడంలో ప్రధాని సేల్స్‌మెన్‌గా వ్యవహరించారు. కరోనా టీకా అందించడంలో సేల్స్‌మెన్‌గా వ్యవహరించారు.' - బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టేది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని పార్టీ సీనియర్ నాయకులు జితేందర్​ రెడ్డి అన్నారు. దేశంలో అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఏ దిశగా తీసుకుపోవాలనే దానిపై ఇక్కడ చర్చలు జరుగుతున్నాయని భాజపా నేత రామ్మోహన్​రావు తెలిపారు.

ప్రధాని మోదీని... కేసీఆర్‌ అవమానపరిచారు: బండి సంజయ్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.